AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cable-Stayed Rail Bridge: కశ్మీర్‌లో ఇంజనీరింగ్ అద్భుతం.. దేశంలోనే తొలి కేబుల్-స్టేడ్ రైలు వంతెన..

జమ్మూశ్మీర్‌లో భవిష్యత్తు సిద్ధంగా ఉందంటూ.. అంజి ఖాడ్ వంతెన తాజా ఫోటోలను అశ్వని వైష్ణవ్ ట్విట్టర్‌లో షేర్ చేశారు. ఇంజినీరింగ్ అద్భుతం.. నిర్మాణంలో ఉన్న అంజి ఖాడ్ వంతెన జమ్మూకశ్మీర్ రాష్ట్రంలోని కత్రా, రియాసీలను కలుపుతుంది.

Cable-Stayed Rail Bridge: కశ్మీర్‌లో ఇంజనీరింగ్ అద్భుతం.. దేశంలోనే తొలి కేబుల్-స్టేడ్ రైలు వంతెన..
Cable Stayed Rail Bridge Jk
Shaik Madar Saheb
|

Updated on: Jul 08, 2022 | 1:26 PM

Share

India’s 1st Cable-Stayed Rail Bridge: దేశంలో మొట్టమొదటి కేబుల్-స్టేడ్ రైలు వంతెన ప్రారంభానికి సిద్ధమమవుతోంది. జమ్మూకశ్మీర్‌లో నిర్మిస్తున్న మొదటి కేబుల్-స్టేడ్ రైలు వంతెన ఈ ఏడాది డిసెంబర్ నాటికి పూర్తవుతుందని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ పేర్కొన్నారు. జమ్మూశ్మీర్‌లో భవిష్యత్తు సిద్ధంగా ఉందంటూ.. అంజి ఖాడ్ వంతెన తాజా ఫోటోలను అశ్వని వైష్ణవ్ ట్విట్టర్‌లో షేర్ చేశారు. ఇంజినీరింగ్ అద్భుతం.. నిర్మాణంలో ఉన్న అంజి ఖాడ్ వంతెన జమ్మూకశ్మీర్ రాష్ట్రంలోని కత్రా, రియాసీలను కలుపుతుంది. అంజి నదికి ఎగువన ఉన్న రియాసి జిల్లాలో ఉన్న ఈ వంతెన సవాలుతో కూడిన ఉధంపూర్-శ్రీనగర్-బారాముల్లా రైలు లింక్‌లో ఒక భాగం. ఇక్కడ భూభాగం హిమాలయాల గుండా ఎత్తైన ప్రదేశంలో ఉంది. ఉదంపూర్-శ్రీనగర్-బారాముల్లా రైలు లింక్ (USBRL) ప్రాజెక్ట్ కింద అంజి ఖాడ్ వంతెనపై భారతీయ రైల్వే 50% పైగా పనులను పూర్తి చేసింది. ఈ మేరకు కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ ట్విటర్‌లో బ్రిడ్జి పురోగతి ఫొటోలను పంచుకుంది. భౌగోళిక పరిస్థితులను అధిగమించి, నిర్మాణం పూర్తి వేగంతో జరుగుతోందని మంత్రిత్వ శాఖ ట్వీట్‌లో పేర్కొంది.

473.25 మీటర్ల పొడవున వంతెనను నదీ మట్టానికి 331 మీటర్ల ఎత్తులో నిర్మిస్తున్నారు. భారీ తుఫానులను ఎదుర్కొనేలా ఈ వంతెనను 96 కేబుల్స్ సపొర్టుతో నిర్మిస్తున్నారు. ఈ ప్రాంతం అత్యంత సంక్లిష్టమైన భూగర్భంలో ఉన్న కారణంగా చీనాబ్ నదికి అడ్డంగా ఈ వంతెనను నిర్మించడం అసాధ్యంగా ఉన్నా.. మన ఇంజినీరింగ్ నిపుణులు సుసాధ్యం చేసి చూపారు. అంజి ఖాడ్ వంతెన వద్ద నిలువు వాలుపై ఒకే పైలాన్‌ను మాత్రమే నిర్మించనున్నారు.

ఇవి కూడా చదవండి

వంతెన నిర్మాణంలో పంప్ కాంక్రీటింగ్ సిస్టమ్ అమరికతో సహా ప్రత్యేకమైన, అధునాతన సాంకేతికతలతో పరికరాలు ఉపయోగించారు. ఉధంపూర్-శ్రీనగర్-బారాముల్లా రైలు లింక్ ప్రాజెక్టును కొంకణ్ రైల్వే కార్పొరేషన్ లిమిటెడ్ (KRCL) అభివృద్ధి చేస్తోంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
సూర్యోదయం ఫోటోను ఈ గదిలో పెడితే శుభం.. కానీ ఇక్కడ మాత్రం అస్సలు..
సూర్యోదయం ఫోటోను ఈ గదిలో పెడితే శుభం.. కానీ ఇక్కడ మాత్రం అస్సలు..
గురు మూఢమిలో ఆస్తిపాస్తులతో ఆ రాశుల వారు జాగ్రత్త!
గురు మూఢమిలో ఆస్తిపాస్తులతో ఆ రాశుల వారు జాగ్రత్త!
మనుషులు కాదు.. మృగాలు! బాలికపై ముగ్గురు ఆటో డైవర్ల పైశాచికం!
మనుషులు కాదు.. మృగాలు! బాలికపై ముగ్గురు ఆటో డైవర్ల పైశాచికం!
పెళ్లి ఇష్టం లేక యువతి గుండు చేయించుకుందా?వైరల్ వీడియో వెనుక నిజం
పెళ్లి ఇష్టం లేక యువతి గుండు చేయించుకుందా?వైరల్ వీడియో వెనుక నిజం
పూజారికి దక్షిణ ఇచ్చి దణ్ణం పెట్టాడు..ఆ తర్వాత ఏం చేశాడో తెలిస్తే
పూజారికి దక్షిణ ఇచ్చి దణ్ణం పెట్టాడు..ఆ తర్వాత ఏం చేశాడో తెలిస్తే
ఇంటి బెడ్‌రూమ్‌లో పడిన ఉల్క.. భూమిపై జీవం పుట్టుకపై సంచలన నిజాలు!
ఇంటి బెడ్‌రూమ్‌లో పడిన ఉల్క.. భూమిపై జీవం పుట్టుకపై సంచలన నిజాలు!
గూగుల్ పిక్సెల్ 11 వస్తోంది.. విడుదల తేదీ ఖరారు.. ఫీచర్స్‌ లీక్..
గూగుల్ పిక్సెల్ 11 వస్తోంది.. విడుదల తేదీ ఖరారు.. ఫీచర్స్‌ లీక్..
నొప్పి తెలియదు.. కానీ ఇవి కిడ్నీ క్యాన్సర్ లక్షణాలని మీకు తెలుసా?
నొప్పి తెలియదు.. కానీ ఇవి కిడ్నీ క్యాన్సర్ లక్షణాలని మీకు తెలుసా?
కూతురా? అని ఎగతాళి చేశారు.. భార్యతో ఏజ్ గ్యాప్ పై సాయాజీ షిండే
కూతురా? అని ఎగతాళి చేశారు.. భార్యతో ఏజ్ గ్యాప్ పై సాయాజీ షిండే
ఈ ఆకుల్లో ఏ మహత్యముందో.. ఆ రోగాలన్నీ మటాష్..
ఈ ఆకుల్లో ఏ మహత్యముందో.. ఆ రోగాలన్నీ మటాష్..