Amarnath Yatra: అమర్‌నాథ్‌ గుహ సమీపంలో భారీ వర్షం.. మరోసారి నిలిచిపోయిన యాత్ర..

Amarnath Flood: భారీ వర్షాలతో పవిత్ర గుహ ప్రాంతాన్ని ఆకాల వర్షాలు పడుతుండటంతో అమర్‌నాథ్ యాత్రను తాత్కాలికంగా నిలిపివేశారు. గుహ పరిసరాల్లో భారీ వర్షాల కురుస్తుండటంతో వరదలు ముంచెత్తుకోవచ్చాయి. పర్వత ప్రాంతం నుంచి వరదలు..

Amarnath Yatra: అమర్‌నాథ్‌ గుహ సమీపంలో భారీ వర్షం.. మరోసారి నిలిచిపోయిన యాత్ర..
Amarnath Yatra
Follow us

|

Updated on: Jul 26, 2022 | 5:16 PM

పవిత్ర అమర్‌నాథ్‌(Amarnath) ప్రాంతంలో మళ్లీ క్లౌడ్‌ బరస్ట్‌ అయ్యింది. భారీ వర్షాలతో పవిత్ర గుహ ప్రాంతాన్ని ఆకాల వర్షాలు పడుతుండటంతో అమర్‌నాథ్ యాత్రను తాత్కాలికంగా నిలిపివేశారు. గుహ పరిసరాల్లో భారీ వర్షాల కురుస్తుండటంతో వరదలు ముంచెత్తుకోవచ్చాయి. పర్వత ప్రాంతం నుంచి వరదలు దూసుకురావడంతో భక్తులను సురక్షిత ప్రాంతానికి తరలించారు. నాలుగువేల మంత్రి యాత్రికులను సురక్షిత ప్రాంతానికి తరలించారు అధికారులు. మూడుగంటల పాటు ఏకధాటిగా వర్షం కురియడంతో అధికారులు అలర్ట్‌ అయ్యారు. గుహ చుట్టుపక్కల ఉన్న పర్వతాలలో భారీ వర్షాల కారణంగా ఈరోజు మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో రిజర్వాయర్లు, సమీపంలోని వాగులు పొంగిపొర్లుతున్నాయి. దీంతో అధికారులు వెంటనే అలర్ట్ ప్రకటించారు. ఇప్పటివరకు 4,000 మందికి పైగా యాత్రికులను సేఫ్ జోన్ నుంచి తరలించారు. పరిస్థితి మొత్తం అదుపులో ఉందని తెలిపారు.

అంతకుముందు జులై 8న అమర్‌నాథ్ గుహ దగ్గర క్లౌడ్ బరస్ట్ జరిగింది. ఈ ఘటనలో 15 మంది మృతి చెందగా, 40 మందికి పైగా గల్లంతయ్యారు. జులై 8న సాయంత్రం 5.30 గంటల ప్రాంతంలో మేఘ విస్ఫోటనం సంభవించింది. ఇందులో గుహ సమీపంలో నిర్మించిన అనేక గుడారాలు ధ్వంసమయ్యాయి. భద్రతా దళాలకు చెందిన విపత్తు నిర్వహణ సంస్థలు వెంటనే రెస్క్యూ ఆపరేషన్‌ను ప్రారంభించాయి. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించేందుకు ఆర్మీ హెలికాప్టర్లు రంగంలోకి దిగాయి. అప్పుడు ప్రయాణం కూడా వాయిదా పడింది. ఆ తర్వాత జూలై 16న మళ్లీ యాత్రను ప్రారంభించారు. 

43 రోజుల పాటు సాగే వార్షిక అమర్‌నాథ్ యాత్ర జూన్ 30న రెండు ప్రధాన మార్గాల్లో ప్రారంభమైంది (దక్షిణ కాశ్మీర్‌లోని 48-కిమీ-పొడవు సాంప్రదాయ నున్వాన్-పహల్గామ్ మార్గం, సెంట్రల్ కాశ్మీర్‌లోని గందర్‌బాల్‌లోని 14-కిమీ-పొడవు బల్తాల్ మార్గం). అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, ఈ ఏడాది ఇప్పటివరకు 2.30 లక్షల మంది యాత్రికులు పవిత్ర గుహలో బాబా బర్ఫానీని దర్శించుకున్నారు.

ఆగస్టు 11న రక్షా బంధన్ సందర్భంగా అమర్‌నాథ్ యాత్ర ముగుస్తుంది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, ఈసారి అమర్‌నాథ్ యాత్రలో మొత్తం 36 మంది యాత్రికులు మరణించారు. అదే సమయంలో, జూలై 1న పవిత్ర గుహ సమీపంలో సంభవించిన ఆకస్మిక వరదలలో మరో 15 మంది యాత్రికులు ప్రాణాలు కోల్పోయారు. 

మరిన్ని జాతీయ వార్తల కోసం