అమ్మ బాబోయ్ ఎయిర్ ఇండియా..! మరో ఫ్లైట్ రద్దు.. 24 గంటల్లో 5 విమానాల్లో సాంకేతిక సమస్యలు!
భారతీయ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియాకు చెందిన మరో విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. మంగళవారం (జూన్ 17) ఢిల్లీ నుండి పారిస్కు వెళ్లే ఈ విమానాన్ని ఎయిర్ ఇండియా రద్దు చేసింది. విమానంలో కొన్ని సమస్యలు ఎదురయ్యాయని, అందువల్ల విమానం రద్దు చేయడం జరిగిందని కంపెనీ పేర్కొంది. టెక్నికల్ ఇష్యూస్ పరిష్కరించి, ప్రయాణికులకు సమాచారం ఇస్తామని తెలిపింది.

గుజరాత్లోని అహ్మదాబాద్లో కూలిపోయిన ఎయిర్ ఇండియా విమానం అంతులేని విషాదాన్ని నింపింది. ఈ ప్రమాదంలో భారీ నష్టం జరిగింది. విమానంలోని 142 మందిలో 141 మంది మరణించారు. అంతేకాదు, విమానం కూలిపోయిన నివాస భవనంలో ఉన్న అనేక మంది మరణించారు. మొత్తం మీద, 270 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదం తర్వాత, అనేక ఎయిర్ ఇండియా విమానాల్లో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. దీంతో ప్రయాణికుల్లో తీవ్ర భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. అయితే తాజాగా 24 గంటల్లో 5 విమానాల్లో సమస్యలు తలెత్తి రద్దు కావడం మరింత ఆందోళన వ్యక్తమవుతోంది.
తాజాగా భారతీయ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియాకు చెందిన మరో విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. మంగళవారం (జూన్ 17) ఢిల్లీ నుండి పారిస్కు వెళ్లే ఈ విమానాన్ని ఎయిర్ ఇండియా రద్దు చేసింది. విమానంలో కొన్ని సమస్యలు ఎదురయ్యాయని, అందువల్ల విమానం రద్దు చేయడం జరిగిందని కంపెనీ పేర్కొంది. టెక్నికల్ ఇష్యూస్ పరిష్కరించి, ప్రయాణికులకు సమాచారం ఇస్తామని తెలిపింది.
ఇక అంతకు ముందు, జూన్ 16న, హాంకాంగ్ నుండి ఢిల్లీకి వస్తున్న ఎయిర్ ఇండియా విమానం AI315లో సాంకేతిక లోపం ఏర్పడింది. విమానం మధ్యలో హాంకాంగ్కు తిరిగి రావలసి వచ్చింది. ఈ విమానం కూడా బోయింగ్ 787-8 డ్రీమ్లైనర్ ద్వారా నడపడం జరుగుతుంది. అదృష్టవశాత్తూ, ప్రయాణీకులందరూ సకాలంలో సురక్షితంగా దిగిపోయారు.
జూన్ 16, సోమవారం నాడు, ఘజియాబాద్లోని హిండన్ విమానాశ్రయంలో ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం గుర్తించారు. ఈ విమానం హిండన్ విమానాశ్రయం నుండి కోల్కతాకు బయలుదేరింది. విమానం నంబర్ IX 1511 ఒక సమస్య కారణంగా ఆగిపోయింది. ఈ సమయంలో, విమానంలోని ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేశారు. ఏదైనా పెద్ద సమస్య రావచ్చని వారు భయపడ్డారు.
మంగళవారం(జూన్ 17) శాన్ ఫ్రాన్సిస్కో నుండి కోల్కతా మీదుగా ముంబై వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానంలో ఒక ఇంజిన్లో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో ప్రయాణికులు మంగళవారం నగర విమానాశ్రయంలో ఆగాల్సిన సమయంలో విమానం దిగాల్సి వచ్చింది. విమానం AI180 అర్ధరాత్రి 12.45 గంటలకు నగర విమానాశ్రయానికి చేరుకుంది. కానీ ఎడమ ఇంజిన్లో సాంకేతిక లోపం కారణంగా విమానం ఆలస్యం అయింది. ఉదయం 5.20 గంటల ప్రాంతంలో, ప్రయాణికులందరినీ దిగమని విమానంలో ప్రకటన చేశారు. విమాన భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు విమాన కెప్టెన్ ప్రయాణికులకు తెలిపారు.
ఎయిర్ ఇండియా శాన్ ఫ్రాన్సిస్కో-ముంబై విమానం కోల్కతాలో ఆగుతుందని చెప్పారు. కానీ కోల్కతా చేరుకున్న తర్వాత, విమానం ల్యాండ్ అయిన తర్వాత తప్పనిసరి తనిఖీ జరిగింది. తనిఖీ సమయంలో, సాంకేతిక సమస్య ఉన్నట్లు అనుమానించారు. ప్రయాణికులందరినీ విమానం నుండి సురక్షితంగా దింపారు. వారిలో కొందరిని ఇప్పుడు కోల్కతాలోని ఒక హోటల్లో ఉంచారు.
అలాగే మరోసారి, మంగళవారం(జూన్ 17) అహ్మదాబాద్లోని ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం ఏర్పడింది. దీని కారణంగా విమానాన్ని రద్దు చేయాల్సి వచ్చింది. ఈ విమానం అహ్మదాబాద్ నుండి లండన్కు వెళుతోంది. ఈ సమాచారం మూలాల నుండి వెలుగులోకి వచ్చింది. ఈ విమానం AI 159 ఢిల్లీ నుండి అహ్మదాబాద్కు వచ్చింది. అహ్మదాబాద్ విమాన ప్రమాదం తర్వాత, ఇది లండన్కు వెళ్లే మొదటి విమానం కావడం విశేషం.
తాజాగా నుండి పారిస్కు వెళ్లే మరో ఎయిర్ ఇండియా విమానం రద్దు అయ్యింది. విమానంలో కొన్ని సమస్యలు ఎదురయ్యాయని, అందువల్ల విమానం రద్దు చేస్తున్నట్లు ఎయింర్ ఇండియా విమానయాన సంస్థ పేర్కొంది. “టేకాఫ్కు ముందు అవసరమైన తనిఖీ సమయంలో, విమానంలో కొన్ని సాంకేతిక సమస్యలు బయటపడ్డాయి. ప్రస్తుతం దీనిని పరిశీలిస్తున్నారు. అదే సమయంలో, పారిస్లోని చార్లెస్ డి గల్లె (CDG) విమానాశ్రయంలో రాత్రి కార్యకలాపాలపై నిషేధం కారణంగా విమానం రద్దు చేయడం జరిగింది” అని కంపెనీ తెలిపింది.
“ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి మేము చింతిస్తున్నాము. ప్రయాణీకులను వీలైనంత త్వరగా వారి గమ్యస్థానానికి తీసుకెళ్లడానికి మేము ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నాము. విమానం రద్దు అయిన తర్వాత, ప్రయాణీకులు హోటల్లో బస చేయడానికి ఏర్పాట్లు చేశాము. దీంతో పాటు, ప్రయాణీకులు టికెట్ను రద్దు చేసుకోవాలని లేదా ఉచిత రీషెడ్యూలింగ్ను ఎంచుకుంటే, కంపెనీ పూర్తి వాపసును కూడా అందించింది” అని ఎయిర్ ఇండియా తెలిపింది.
#TravelAdvisoryDue to inclement weather conditions in Delhi, our flight operations are getting impacted with some diversions.
Please check your flight status before heading to the airport: https://t.co/6ajUZVeeIM
— Air India (@airindia) June 17, 2025
ఇదిలావుంటే, 24గంటల వ్యవధిలో 5 విమానాల్లో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. వరుస ఘటనలతో ప్రయాణికుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. విమానం ఎక్కాలంటే జంకుకునే పరిస్థితులు నెలకొన్నాయి. ముఖ్యంగా వరుసగా ఎయిర్ ఇండియా విమానాల్లోనే సమస్యలు తలెత్తుతుండటం మరిన్ని ప్రశ్నలు లేవనెత్తుతోంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




