AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad Plane Crash: అంతకంతకు పెరుగుతున్న విమాన ప్రమాద మృతుల సంఖ్య.. ఇప్పటివరకు ఎంతమంది మరణించారంటే!

అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో మృతుల సంఖ్య అంతకంతకు పెరుగూ ఉంది. ప్రమాదం జరిగిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న రెస్క్యూ సిబ్బంది మృతదేహాలను వెలికి తీసే పనిలో నిమగ్నమయ్యారు. అయితే ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 274 మంది వరకు మృతి చెందినట్టు తెలుస్తుంది. ఇందులో 241 మంది విమాన ప్రయాణికులు ఉండగా,33 మంది బిజె మెడికల్ కళాశాలకు చెందిన వారు ఉన్నట్టు సమాచారం.

Ahmedabad Plane Crash: అంతకంతకు పెరుగుతున్న విమాన ప్రమాద మృతుల సంఖ్య.. ఇప్పటివరకు ఎంతమంది మరణించారంటే!
Death Toll Rises
Anand T
|

Updated on: Jun 14, 2025 | 2:29 PM

Share

గురువారం గుజరాత్‌లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. అహ్మదాబాద్‌ నుంచి లండన్‌కు బయల్దేరిన ఎయిర్ ఇండియా AI 171 మిమానం రన్‌వే నుంచి టేకాఫ్ అయిన కాసేపటికే ఎయిర్‌ పోర్ట్ సమీపంలోని బీజె మెడికల్ కాలేజ్‌ బిడ్జింగ్‌ను ఢీకొట్టి కుప్పకూలింది. ఈ ప్రమాదంలో స్పాట్‌లోనే గుజరాత్‌ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ సహా 241 మంది మరణించారని అహ్మదాబాద్‌ సీపీ తెలిపారు. విమానం కాలేజ్ బిడ్జింగ్‌ను ఢీకొట్టడంతో బిడ్జింగ్‌లోని మెడికల్‌ విద్యార్థులు కూడా చనిపోయినట్టు ఆయన తెలిపారు.అయితే, ప్రమాదం జరిగిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న రెస్క్యూ సిబ్బంది మృతదేహాలను వెలికి తీసే పనిలో నిమగ్నమయ్యారు. మరోవైపు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వారిని అహ్మదాబాద్ సివిల్ ఆసుపత్రికి తరలించారు.

కాగా ఈ ప్రమాదంలో చనిపోయిన వారి సంఖ్య అంతకంతకు పెరుగుతుంది. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 274 మంది మరణించినట్టు అధికారులు చెబుతున్నారు. మృతి చెందిన వారిలో 241 మంది విమాన ప్రయాణికులు ఉండగా,33 మంది బిజె మెడికల్ కళాశాలకు చెందిన వారు ఉన్నట్టు సమాచారం. అయితే ప్రమాదంలో గాయపడి చికిత్స పొందిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉండడంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. గాయపడిన వారు ప్రస్తుతం అహ్మదాబాద్ సివిల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

మరోవైపు ఈ ప్రమాదంలో మృతి చెందిన వారి మృతదేహాలు పూర్తిగా కాలిపోవడంతో వారిని గుర్తించడం కష్టతరంగా మారింది. దీంతో మృతదేహాలను గుర్తించేందుకు వైద్యులు డీఎన్‌ఏ టెస్ట్‌లు నిర్వహిస్తున్నారు.ఈ డీఎన్ఏ టెస్టు ఫలితాల ఆధారంగా విమాన ప్రమాదంలో మృతి చెందిన ప్రయాణికుల మృతుదేహాలను వారి కుటుంబ సభ్యులకు అప్పగించనున్నారు అధికారులు.

కాగా అహ్మదాబాద్‌లోని విమాన ప్రమాద ఘటనా స్థలాన్ని పరిశీలించనున్నారు. కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ. ఘటనా స్థలానికి పరిశీలించిన తర్వాత విమాన ప్రమాదంలో గాయపడి సివిల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించనున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
గ్యాస్ బుకింగ్ పేరుతో మెసేజ్‌లు వచ్చాయా..జాగ్రత్త.. క్లిక్ చేశారో
గ్యాస్ బుకింగ్ పేరుతో మెసేజ్‌లు వచ్చాయా..జాగ్రత్త.. క్లిక్ చేశారో
నిద్ర పట్టడం లేదా.. మీ మెదడులో ఏం జరుగుతుందో తెలుసా?
నిద్ర పట్టడం లేదా.. మీ మెదడులో ఏం జరుగుతుందో తెలుసా?
పునరుజ్జీవంపై రాజకీయ యుద్ధం! మూసీ రివర్‌ ఫ్రంట్ ప్రాజెక్ట్‌తో..
పునరుజ్జీవంపై రాజకీయ యుద్ధం! మూసీ రివర్‌ ఫ్రంట్ ప్రాజెక్ట్‌తో..
మీ అమ్మాయి జుట్టు ఒత్తుగా బలంగా పెరగాలా.. ఇదొక్కటి చాలు
మీ అమ్మాయి జుట్టు ఒత్తుగా బలంగా పెరగాలా.. ఇదొక్కటి చాలు
పవన్ కల్యాణ్‌ డిప్యూటీ సీఎం పదవిపై TV9 క్రాస్‌ఫైర్‌లో..
పవన్ కల్యాణ్‌ డిప్యూటీ సీఎం పదవిపై TV9 క్రాస్‌ఫైర్‌లో..
ఏపీ రాజకీయాల్లో ఆయనే నా ఫేవరెట్ పొలిటీషియన్- టీవీ9తో అంబటి
ఏపీ రాజకీయాల్లో ఆయనే నా ఫేవరెట్ పొలిటీషియన్- టీవీ9తో అంబటి
మావోయిస్ట్ వ్యూహాల్లో భారీ మార్పు? దేవుజీ ఇంటర్వ్యూలో వాస్తవాలు
మావోయిస్ట్ వ్యూహాల్లో భారీ మార్పు? దేవుజీ ఇంటర్వ్యూలో వాస్తవాలు
ఉగాది రోజున నాన్‌వెజ్ తినొచ్చా? తింటే ఏం జరుగుతుంది?
ఉగాది రోజున నాన్‌వెజ్ తినొచ్చా? తింటే ఏం జరుగుతుంది?
ఒంట్లో కొవ్వు కరిగించి.. మీ బాడీని ఏసీలా మార్చేసే మ్యాజిక్ జ్యూస్
ఒంట్లో కొవ్వు కరిగించి.. మీ బాడీని ఏసీలా మార్చేసే మ్యాజిక్ జ్యూస్
కరివేపాకు చికెన్ ఫ్రై.. ఇలా కాల్చుకుని తింటే యమా టేస్ట్..
కరివేపాకు చికెన్ ఫ్రై.. ఇలా కాల్చుకుని తింటే యమా టేస్ట్..