AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Fact Check: ‘ఆపరేషన్ సిందూర్’ తర్వాత నకిలీ వార్తలు వైరల్ చేస్తున్న పాకిస్థాన్.. అప్రమత్తంగా ఉండాలి..!

ఆపరేషన్ సిందూర్ తర్వాత, పాకిస్తాన్ మళ్ళీ సత్యాన్ని దాచిపెట్టి, క్షేత్ర వాస్తవికత నుండి దృష్టిని మళ్లించడానికి తనకు తెలిసిన ఉపాయాన్ని ఆశ్రయించింది. పాత ఛాయాచిత్రాలు, వీడియోలను తప్పుగా చూపించడం ద్వారా కల్పిత వాదనలు చేయడం ప్రారంభించింది. దీంతో పాటు, ప్రజలు వాటిని సోషల్ మీడియాలో వైరల్ చేయడం ప్రారంభించారు.

Fact Check: 'ఆపరేషన్ సిందూర్' తర్వాత నకిలీ వార్తలు వైరల్ చేస్తున్న పాకిస్థాన్.. అప్రమత్తంగా ఉండాలి..!
Fake News
Follow us
Balaraju Goud

|

Updated on: May 08, 2025 | 1:24 AM

‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో ఉగ్రవాద శిబిరాలపై భారత సైన్యం క్షిపణి దాడులు చేసిన తర్వాత పాకిస్తాన్ తీవ్రంగా కృంగిపోయింది. ఈ భయాందోళనలో, పాకిస్తాన్ మీడియా, షరీఫ్ ప్రభుత్వం నకిలీ వార్తలను వ్యాప్తి చేస్తున్నాయి. ఈ దాడిలో చాలా మంది ఉగ్రవాదులు మరణించినట్లు వార్తలు వస్తున్నాయి.

నిజానికి, పాకిస్తాన్ తన బలహీనతను దాచుకోవడానికి నకిలీ వార్తల ద్వారా డిజిటల్ యుద్ధాన్ని ప్రారంభించింది. పాకిస్తాన్ అనుకూల సోషల్ మీడియా హ్యాండిళ్లు, ప్రభావవంతమైన రాజకీయ వ్యక్తులు ఉద్దేశపూర్వకంగా నకిలీ వార్తలను వ్యాప్తి చేస్తున్నారు. పాకిస్తాన్ సైన్యం అద్భుత సైనిక విజయాలు, వీరోచిత ప్రతీకార చర్యల గురించి కథలను వక్రీకరిస్తోంది.

సత్యాన్ని దాచిపెట్టి, వాస్తవాల నుండి దృష్టిని మళ్లించడానికి పాకిస్తాన్ తనకు సుపరిచితమైన వ్యూహాలను ఆశ్రయించింది. పాత ఛాయాచిత్రాలను తిరిగి ఉపయోగించడం, పాత వీడియోలను తప్పుగా చూపించడం, పూర్తిగా కల్పిత వాదనలు చేయడం, వాటిని సోషల్ మీడియాలో ప్రచారం చేయడం ప్రారంభించింది పాకిస్థాన్.

వారి లక్ష్యం స్పష్టంగా ఉంది. సమాచార రంగాన్ని అంత త్వరగా, అంత పెద్ద పరిమాణంలో అబద్ధాలతో నింపడం, వాస్తవాలకు, కల్పనలకు మధ్య తేడాను గుర్తించడం కష్టమవుతుంది. ఇది కేవలం తప్పుడు సమాచారం కాదు, వాస్తవికతను తప్పుదారి పట్టించడానికి, ప్రజలను తప్పుదారి పట్టించడానికి, ఈ ప్రాంతం అంతటా అవగాహనలను మార్చటానికి రూపొందించిన బాగా ప్రణాళికాబద్ధమైన ప్రచారం.

బహవల్పూర్ సమీపంలో పాకిస్తాన్ సైన్యం భారత రాఫెల్ జెట్‌ను కూల్చివేసిందని తప్పుగా పేర్కొన్న వైరల్ చిత్రం దీనికి అత్యంత ప్రముఖ ఉదాహరణలలో ఒకటి. అయితే, ఈ ఫోటోను PIB ఫ్యాక్ట్ చెక్ తోసిపుచ్చింది. ఈ చిత్రం వాస్తవానికి 2021లో పంజాబ్‌లోని మోగాలో జరిగిన MiG-21 ప్రమాదానికి సంబంధించినది. దీనికి ప్రస్తుత సంఘటనలకు ఎలాంటి పోలిక లేదని నిర్ధారించింది.

చోరా పోస్ట్ వద్ద భారత సైన్యం తెల్ల జెండాను ఎగురవేసి లొంగిపోయిందని తప్పుడుగా పేర్కొంటూ వీడియో రూపంలో మరో తప్పుడు సమాచారం బయటపడింది. ఈ కల్పిత కథనాన్ని పాకిస్తాన్ మంత్రి అతుల్లా తరార్ మరింత బలోపేతం చేశారు. ఆయన ఎటువంటి ఆధారాలు లేకుండా ఈ వాదనను బహిరంగంగా సమర్ధించారు. ఒక తప్పుడు కథనానికి అధికారిక ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా, తరార్ తన సొంత పౌరులను తప్పుదారి పట్టించడమే కాకుండా తప్పుుడ ప్రచారానికి తెగబడ్డాడు.

మరో తప్పుదారి పట్టించే పోస్ట్‌లో, పాకిస్తాన్ వైమానిక దళం శ్రీనగర్ వైమానిక స్థావరాన్ని లక్ష్యంగా చేసుకుందనే వాదనతో ఒక వీడియో వైరల్ అవుతోంది. నిజానికి, ఆ ఫుటేజ్ 2024 ప్రారంభంలో పాకిస్తాన్‌లోని ఖైబర్ పఖ్తుంఖ్వాలో జరిగిన మత ఘర్షణలకు సంబంధించినది. ఆ వీడియోకు కాశ్మీర్‌తో లేదా ఇటీవలి వైమానిక దాడితో ఎటువంటి సంబంధం లేదు.

రక్షణ వర్గాల సమాచారం ప్రకారం, పాకిస్తాన్ భారత బ్రిగేడ్ ప్రధాన కార్యాలయాన్ని ధ్వంసం చేసిందని ఒక ప్రత్యేక పుకారు వచ్చింది. కానీ ఈ వాదనకు ఎటువంటి వాస్తవిక ఆధారం లేదు. ఇది పూర్తిగా కల్పితం. అంతేకాకుండా, 2024 సెప్టెంబర్‌లో రాజస్థాన్‌లోని బార్మెర్‌లో జరిగిన MiG-29 ప్రమాదానికి సంబంధించిన మరొక పాత చిత్రాన్ని ఇటీవల పాకిస్తాన్ అనుకూల సోషల్ మీడియా హ్యాండిల్స్ భారత వైమానిక దళ నష్టాలను ఉదహరిస్తూ తిరిగి ప్రసారం చేశాయి. వాస్తవానికి అది జరగనేలేదు.

ఇటీవలి సైనిక దాడుల్లో భారత సైనికులు పట్టుబడ్డారని పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ నిరాధారమైన వాదనలు చేశారు. ఆ ప్రకటనను తరువాత తిరస్కరించి ఉపసంహరించుకున్నారు. భారతదేశం చేపట్టిన ఆపరేషన్ సిందూర్ కు ప్రతిస్పందనగా పాకిస్తాన్ భారత సైనికులను బందీలుగా తీసుకుందని ఆసిఫ్ ఆరోపించారు. అయితే, ఈ వాదనలు అబద్ధమని వెంటనే తోసిపుచ్చారు. పట్టుబడిన సైనికుల వాదనలకు మద్దతు ఇవ్వడానికి ఎటువంటి ఆధారాలు లేవు. తరువాత రక్షణ మంత్రి తన ప్రకటనను ఉపసంహరించుకుని, ఏ భారతీయ సైనికుడిని అదుపులోకి తీసుకోలేదని అంగీకరించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..