ఆ భారత భూభాగం నేపాల్‌దే అంటూ మనిషా కోయిరాల కాంట్రవర్సియల్ కామెంట్స్!

ఆ భారత భూభాగాలు నేపాల్‌వే అంటూ మనిషా కోయిరాల చేసిన కాంట్రవర్సియల్ కామెంట్స్ ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీస్తోంది. ప్రస్తుతం ఈ న్యూస్‌కి సంబంధించి ఆమె చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. నేపాల్ తీసుకున్న వివాదాస్పద నిర్ణయానికి సీనియర్ హీరోయిన్..

ఆ భారత భూభాగం నేపాల్‌దే అంటూ మనిషా కోయిరాల కాంట్రవర్సియల్ కామెంట్స్!
Follow us

| Edited By:

Updated on: May 21, 2020 | 11:27 AM

ఆ భారత భూభాగాలు నేపాల్‌వే అంటూ మనిషా కోయిరాల చేసిన కాంట్రవర్సియల్ కామెంట్స్ ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీస్తోంది. ప్రస్తుతం ఈ న్యూస్‌కి సంబంధించి ఆమె చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. నేపాల్ తీసుకున్న వివాదాస్పద నిర్ణయానికి సీనియర్ హీరోయిన్ మనీషా కోయిరాలా ఇప్పుడు మద్దతు పలికింది. భారత్, నేపాల్ సరిహద్దుల్లో ఉన్న మూడు పట్టణాలు లిపులేక్, కాలాపాని, లింపియాధురా పట్టణాలను తమవే అంటూ నేపాల్ ఓ కొత్త మ్యాప్‌ను రిలీజ్ చేసింది. మే 18వ తేదీన ఈ మేరకు నేపాల్ కేబినెట్ రిలీజ్ చేసింది. ఆ కొత్త మ్యాప్‌కి కేబినెట్ ఆమోదం కూడా తెలిపింది. ఆ నిర్ణయాన్ని బాలీవుడ్ హీరోయిన్ మనిషా కోయిరాల సమర్థించింది.

ఆ మూడు పట్టణాలను తమదిగా పేర్కొంటూ నేపాల్ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రదీప్ గ్యావాలీ చేసిన ట్వీట్‌ను.. మనిషా కోయిరాల రీ ట్వీట్ చేసింది. ఆ ట్వీట్‌లో ‘మన చిన్న దేశం స్వాభిమానాన్ని కాపాడినందుకు థాంక్స్. దీనిపై మూడు గొప్ప దేశాల మధ్య శాంతియుతమైన, గౌరవప్రదంగా చర్చలు జరుగుతాయని ఎదురుచూస్తున్నానని’ మనిషా ట్వీట్ చేసింది. అయితే మనిషా చేసిన ట్వీట్‌పై నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. ఆమెను నేపాల్ వెళ్లిపోవాలంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ఇది కూడా చదవండి: 

వృద్ధులకు మరో బంపర్ ఆఫర్ ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం..

‘కరోనా కాలర్ ట్యూన్‌’తో విసుగుచెందారా.. ఈ సింపుల్ ట్రిక్‌తో దాన్ని కట్ చేయండి