AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వీళ్ళే నిరసనకారులు.. ఆచూకీ చెప్పండి.. యూపీ పోలీసుల వెరైటీ ప్రచారం

సవరించిన పౌరసత్వ చట్టానికి నిరసనగా తమపై రాళ్లు రువ్విన, గన్స్ ఝళిపించిన సుమారు 110 మంది ఆందోళనకారుల ఫోటోలను యూపీ పోలీసులు రిలీజ్ చేశారు. కాన్పూర్, ఫిరోజాబాద్, మావూలలో ఇటీవల పెద్దఎత్తున హింస చెలరేగిన సంగతి తెలిసిందే.. ఆ సందర్భంగా వీరంతా ఖాకీలపై రెచ్చి పోయారు. వీరి రాళ్లదాడిలో [పలువురు పోలీసులకు గాయాలయ్యాయి. గోరఖ్ పూర్ లో నిరసనలకు దిగినవారి ఆస్తులను జప్తు చేస్తామని వారికి నోటీసులు పంపారు. బిజ్నూర్ లో ముగ్గురు వ్యక్తులకు సంబంధించిన సమాచారం […]

వీళ్ళే నిరసనకారులు.. ఆచూకీ చెప్పండి.. యూపీ పోలీసుల వెరైటీ ప్రచారం
Anil kumar poka
|

Updated on: Dec 26, 2019 | 2:18 PM

Share

సవరించిన పౌరసత్వ చట్టానికి నిరసనగా తమపై రాళ్లు రువ్విన, గన్స్ ఝళిపించిన సుమారు 110 మంది ఆందోళనకారుల ఫోటోలను యూపీ పోలీసులు రిలీజ్ చేశారు. కాన్పూర్, ఫిరోజాబాద్, మావూలలో ఇటీవల పెద్దఎత్తున హింస చెలరేగిన సంగతి తెలిసిందే.. ఆ సందర్భంగా వీరంతా ఖాకీలపై రెచ్చి పోయారు. వీరి రాళ్లదాడిలో [పలువురు పోలీసులకు గాయాలయ్యాయి. గోరఖ్ పూర్ లో నిరసనలకు దిగినవారి ఆస్తులను జప్తు చేస్తామని వారికి నోటీసులు పంపారు. బిజ్నూర్ లో ముగ్గురు వ్యక్తులకు సంబంధించిన సమాచారం తెలియజేసేవారికి రూ. 25 వేల రివార్డు ఇస్తామని పోలీసులు ప్రకటించారు. ఫిరోజాబాద్, గోరఖ్ పూర్ పోలీసులు తమ ‘ వాంటెడ్ లిస్ట్ ‘ లో ఉన్న వ్యక్తుల ఫోటోలను వాట్సాప్, ఫేస్ బుక్ లలో సర్క్యులేట్ చేశారు. కొన్ని బహిరంగ ప్రదేశాల్లోనూ పోస్టర్స్ అంటించారు. వీరి ఆచూకీ తెలిపేవారి సమాచారాన్ని గోప్యంగా ఉంచుతామని. అలాగే తాము కూడా వీరి వివరాలను ఎవరికీ తెలియజేయబోమని వారు పేర్కొన్నారు. యూపీలో జరిగిన ఘర్షణలు, అల్లర్లలో సుమారు 19 మంది మరణించారు. పోలీసులు ఇప్పటివరకు 213 కేసులు నమోదు చేసి దాదాపు వెయ్యిమందిని అరెస్ట్ చేశారు. మావులో గత సోమవారం అనేకమంది ఆందోళనకారులు ఖాకీలపై రాళ్లు రువ్వడమే గాక.. కొన్ని వాహనాలను కూడా తగులబెట్టారు. కాగా-కాన్పూర్ పోలీసులు 48 మంది ఫోటోలను, ఫిరోజాబాద్ ఖాకీలు 80 మంది ఫోటోలను రిలీజ్ చేశారు.