AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వరుస భూకంపాలతో గజగజ వణుకుతున్న మిజోరం

ఈశాన్య రాష్ట్రమైన మిజోరం గజగజ వణికిపోతుంది. ఓ వైపు కరోనో విజృంభిస్తుంటే.. మరోవైపు ప్రకృతి కూడా వణికిస్తోంది. గత వారం రోజులుగా వరుస భూకంపాలు వస్తుండటంతో.. ప్రజలు ప్రాణాల్ని అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నారు.

వరుస భూకంపాలతో గజగజ వణుకుతున్న మిజోరం
Earthquake
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jun 25, 2020 | 11:15 AM

Share

ఈశాన్య రాష్ట్రమైన మిజోరం గజగజ వణికిపోతుంది. ఓ వైపు కరోనో విజృంభిస్తుంటే.. మరోవైపు ప్రకృతి కూడా వణికిస్తోంది. గత వారం రోజులుగా వరుస భూకంపాలు వస్తుండటంతో.. ప్రజలు ప్రాణాల్ని అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నారు. తాజాగా గురువారం నాడు మరోసారి భూకంపం సంభవించింది. రాష్ట్రలోని దక్షిణ చంఫాయ్ ప్రాంతంలో.. రిక్టార్ స్కేల్‌పై 4.5గా నమోదైంది. తెల్లవారుజామున 1.14 గంటలకు ఈ భూకంపం వచ్చినట్లు తెలుస్తోంది. దక్షిణ చంఫాయ్ ప్రాంతం నుంచి 21 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించారు.

కాగా, మంగళవారం తెల్లవారుజామున కూడా.. ఇదే ప్రాంతంలో భూకంపం వచ్చింది. జూన్ 22వ తేదీన.. పన్నెండు గంటల వ్యవధిలోనే రెండు సార్లు భూకంపాలు రావడంతో.. ప్రజలు భయం గుప్పిట్లో బతుకుతున్నారు.ఇక అంతకుముందు.. జూన్ 21వ తేదీన కూడా తెల్లవారుజామున ఐజ్వాల్ కేంద్రంగా భూకంపం వచ్చింది. రిక్టార్ స్కేల్‌పై 5.1గా నమోదైంది. ఇక జూన్ 18వ తేదీన సాయంత్రం చంఫాయ్ ప్రాంతంలోనే భూకంపం వచ్చింది. ఇక ఇలా వరుస భూకంపాలతో.. ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. భూ ప్రకంపనలు వచ్చినప్పుడల్లా.. ప్రజలంతా ఇళ్ల నుంచి బయటకు వచ్చి వీధుల్లో పరుగులు తీస్తున్నారు.