AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

13 మంది విద్యార్థులపై టీచర్‌ దాష్టీకం.. ఆస్పత్రిలో చిన్నారులు.. రోడ్డెక్కి తల్లిదండ్రుల ఆందోళన..

పసివాళ్లని కూడా చూడకుండా స్కూల్‌ విద్యార్థులను అత్యంత దారుణంగా చితకబాదాడు. ఇష్టమొచ్చినట్టు కొట్టాడు. కర్రలతో విచక్షణా రహితంగా చితకబాదాడు.

13 మంది విద్యార్థులపై టీచర్‌ దాష్టీకం.. ఆస్పత్రిలో చిన్నారులు.. రోడ్డెక్కి తల్లిదండ్రుల ఆందోళన..
Teacher
Jyothi Gadda
|

Updated on: Sep 30, 2022 | 9:51 PM

Share

విద్యాబుద్దులు నేర్పించాల్సిన ఓ ఉపాధ్యాయుడు.. బుద్ధి లేకుండా ప్రవర్తించాడు. పసివాళ్లని కూడా చూడకుండా స్కూల్‌ విద్యార్థులను అత్యంత దారుణంగా చితకబాదాడు. ఇష్టమొచ్చినట్టు కొట్టాడు. కర్రలతో విచక్షణా రహితంగా చితకబాదాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో టీచర్ మీద పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కాగా, ఈ షాకింగ్ ఘటన జార్ఖండ్‌లోని గుమ్లాలో చోటు చేసుకుంది. జార్ఖండ్‌లోని గుమ్లాలో పాఠశాల ఉపాధ్యాయుడు 13 మంది విద్యార్థులను కర్రలతో దారుణంగా కొట్టడంతో విద్యార్థులు ఆసుపత్రి పాలయ్యారు. 6వ తరగతి విద్యార్థులను కొట్టి పాఠశాలలోని తరగతి గదిలో బంధించారు. గాయపడిన 13 మంది విద్యార్థులను ఆరోగ్య కేంద్రంలో చేర్చారు. అక్కడ వైద్యులు వారికి చికిత్స అందిస్తున్నారు.

గుమ్లాలోని సెయింట్ మైఖేల్ పాఠశాలకు చెందిన వికాస్ సిరిల్ అనే ఉపాధ్యాయుడు, 6వ తరగతి విద్యార్థులు తన ఆదేశాల మేరకు డ్యాన్స్ చేయడానికి నిరాకరించడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులు ప్రిన్సిపాల్‌కు సమాచారం అందించినా ఫలితం లేకపోయింది. అయితే విద్యార్థులను కొట్టాలని ప్రిన్సిపాల్ ఉపాధ్యాయుడిని ఆదేశించారు. దీంతో ఆగ్రహించిన తల్లిదండ్రులు పాఠశాలకు వ్యతిరేకంగా రోడ్లపైకి వచ్చి ఆందోళనకు దిగారు. తమ పిల్లల భవిష్యత్తుతో ఆడుకునేలా ఉపాధ్యాయులు మనుషులమని మర్చిపోయి ప్రవర్తిస్తున్నారని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు.

గతంలో కూడా ఇలాంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. టీచర్ దాడి చేయడంతో తల్లిదండ్రులు స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. 13 మంది విద్యార్థుల నుంచి దరఖాస్తులు అందాయని స్టేషన్ హౌస్ ఆఫీసర్ అశుతోష్ సింగ్ తెలిపారు. దీనిపై విచారణ జరుపుతున్నామని, విచారణ ఫలితాల ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు. తల్లిదండ్రుల ఫిర్యాదు ఆధారంగా బ్లాక్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ శిశిర్ కుమార్ సింగ్ కూడా ఈ విషయంపై దర్యాప్తు చేయడానికి ఒక బృందాన్ని ఏర్పాటు చేశారు. నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని తల్లిదండ్రులకు హామీ ఇచ్చారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
ఖాళీ కడుపుతో ఈ 9 పనులు అస్సలు చేయకండి.. ఆరోగ్యం జాగ్రత్త!
ఖాళీ కడుపుతో ఈ 9 పనులు అస్సలు చేయకండి.. ఆరోగ్యం జాగ్రత్త!
చెక్ బౌన్స్‌ కేసు నిజంగా జైలు శిక్షకు దారితీస్తుందా? రూల్స్ ఏంటి?
చెక్ బౌన్స్‌ కేసు నిజంగా జైలు శిక్షకు దారితీస్తుందా? రూల్స్ ఏంటి?
జోరు వానలో తడిచిన వాళ్ళు ఇవి రెండు గారెలు తింటే నీరసం పోయి..
జోరు వానలో తడిచిన వాళ్ళు ఇవి రెండు గారెలు తింటే నీరసం పోయి..
తల్లిదండ్రులు అందరూ అప్రమత్తంగా ఉండాల్సిన విషయం ఇది..
తల్లిదండ్రులు అందరూ అప్రమత్తంగా ఉండాల్సిన విషయం ఇది..
దుమ్మురేపిన తిలక్ సేన.. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ ఎవరంటే..?
దుమ్మురేపిన తిలక్ సేన.. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ ఎవరంటే..?
'సమరసింహారెడ్డి'లోని ఆ డైలాగులు పరిటాల రవి మాటలే: పరుచూరి
'సమరసింహారెడ్డి'లోని ఆ డైలాగులు పరిటాల రవి మాటలే: పరుచూరి
ఉదయాన్నే నీళ్లు ఎప్పుడు తాగాలి? బ్రష్ చేయడానికి ముందా.. తర్వాతనా?
ఉదయాన్నే నీళ్లు ఎప్పుడు తాగాలి? బ్రష్ చేయడానికి ముందా.. తర్వాతనా?
విద్యార్థులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్..
విద్యార్థులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్..
వర్షాకాలంలో గొంతు నొప్పి బాధలు.. గరగరను చిటికెలో తగ్గించే..
వర్షాకాలంలో గొంతు నొప్పి బాధలు.. గరగరను చిటికెలో తగ్గించే..
భారీగా దిగి వస్తున్న బంగారం, వెండి ధరలు..తెలుగు రాష్ట్రాల్లో ఎంత?
భారీగా దిగి వస్తున్న బంగారం, వెండి ధరలు..తెలుగు రాష్ట్రాల్లో ఎంత?