
ప్రస్తుతం వ్యవసాయంలో పురుగుమందులు, రసాయనాల వినియోగం విస్తృతంగా పెరిగింది. పండ్లు, కూరగాయలు పండించే దశ నుంచి మార్కెట్కు చేరే వరకు వాటిపై వివిధ రకాల రసాయనాలు ఉపయోగిస్తుంటారు. దీంతో వాటిని తినే ముందు సరిగ్గా శుభ్రం చేయడం చాలా అవసరం. కేవలం నీటితో కడగడం వల్ల అన్ని రసాయన అవశేషాలు, బ్యాక్టీరియా పూర్తిగా తొలగిపోవు. అందుకే కొన్ని సులభమైన పద్ధతులను పాటించడం ద్వారా పండ్లు, కూరగాయలను మరింత సురక్షితంగా మార్చుకోవచ్చు.
పండ్లు, కూరగాయలపై ఉండే కొన్ని రకాల రసాయన అవశేషాలు, సూక్ష్మజీవులను తొలగించడంలో వెనిగర్ ఉపయోగపడుతుంది.
బేకింగ్ సోడా కూడా పండ్లు, కూరగాయలపై ఉండే కొన్ని పురుగుమందుల అవశేషాలను తగ్గించడంలో సహాయపడుతుంది. ఎలా శుభ్రం చేయాలంటే..
ఇది ఇంట్లో సులభంగా పాటించగల పద్ధతి. కూరగాయలపై ఉండే దుమ్ము, క్రిములు, బ్యాక్టీరియాను తొలగించడంలో ఉపయోగపడుతుంది.
పండ్లు, కూరగాయలపై మిగిలే రసాయన అవశేషాలు, బ్యాక్టీరియా, ధూళి కణాలు ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు, గర్భిణులు వీటిని తీసుకునే ముందు మరింత జాగ్రత్త వహించాలి.
ఆరోగ్యకరమైన ఆహారం కోసం పండ్లు, కూరగాయలు ఎంత ముఖ్యమో, వాటిని సురక్షితంగా శుభ్రం చేయడం కూడా అంతే ముఖ్యమని నిపుణులు సూచిస్తున్నారు.