
జ్వరం వచ్చినప్పుడు చాలా మంది ORS తాగుతారు. దీనివల్ల శరీరం త్వరగా హైడ్రేట్ అవుతుంది. శరీరం కోల్పోయిన నీరు, లవణాలను తిరిగి పొందడానికి సాధారణంగా ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్ తీసుకుంటారు. అయితే ORS మాత్రమే సరిపోతుందా..? దీనితో పాటు మందులు తీసుకోవాలా..? అనే సందేహాలు చాలామందిలో ఉంటాయి. ఈ విషయాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం..
వాంతులు లేదా విరేచనాలు ఎక్కువగా అయినప్పుడు శరీరం నుంచి కేవలం నీరే కాదు, ముఖ్యమైన లవణాలు, ఖనిజాలు కూడా కోల్పోతాయి. దీనివల్ల బలహీనత, తలతిరగడం వంటి సమస్యలు వస్తాయి. ORS ద్రావణంలో ఉప్పు, చక్కెర, ఎలక్ట్రోలైట్లు సరైన మోతాదులో ఉంటాయి. ఇది శరీరానికి తక్షణ శక్తినిచ్చి, డీహైడ్రేషన్ కాకుండా కాపాడుతుంది.
సాధారణ పరిస్థితుల్లో: తేలికపాటి వాంతులు లేదా విరేచనాలు అయినప్పుడు కేవలం ORS మాత్రమే సరిపోతుంది. చాలామందికి మందులు లేకుండానే నయమవుతుంది.
తీవ్రమైన పరిస్థితుల్లో: విరేచనాలు ఆగకుండా కొనసాగినా, కడుపు నొప్పి వచ్చినా, లేదా రక్తంతో కూడిన విరేచనాలు అయినా ORS మాత్రమే సరిపోదు. ఇలాంటి సందర్భాలలో వెంటనే వైద్యుడిని సంప్రదించి, వారు సూచించిన మందులు తీసుకోవాలి.
వైద్యులు సాధారణంగా ORS తో పాటు కొన్ని రకాల మందులను సూచిస్తారు.
యాంటీబయాటిక్స్: బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వల్ల విరేచనాలు అయినప్పుడు మాత్రమే డాక్టర్లు వీటిని సూచిస్తారు.
ప్రోబయోటిక్స్: పేగుల్లో మంచి బ్యాక్టీరియాను పెంచి, పేగులను బలోపేతం చేయడానికి ఈ మందులు సహాయపడతాయి. వైద్యులు తరచుగా వీటిని ORS తో పాటు సిఫార్సు చేస్తారు.
వాంతులు లేదా జ్వరం కోసం మందులు కూడా వైద్యుని సలహా మేరకు మాత్రమే తీసుకోవాలి.
శరీరం డీహైడ్రేషన్ అయినప్పుడు ORS చాలా సురక్షితమైన, ప్రభావవంతమైన పరిష్కారం. అయితే తీవ్రమైన సమస్యలు ఉంటే మాత్రం వెంటనే వైద్యుడిని సంప్రదించి సలహా తీసుకోవడం ఉత్తమం.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)
మరిన్ని లైఫ్స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..