AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kidney Stones: తక్కువ నీళ్లు తాగితే కిడ్నీల్లో రాళ్లు వస్తాయా? ఈ డౌట్ మీకూ ఉందా..

మనలో చాలా మంది మాటిమాటికీ మూత్రంకి వెళ్లవల్సి వస్తుందని నీళ్లు తాగడం మానుకుంటూ ఉంటారు. నీళ్లు తాగకపోవడానికి ఒత్తిడితో కూడిన జీవితం, పని చింతలు, దాహం లేకపోవడం వంటి ప్రధాన కారణాలు కూడా ఉన్నాయి. దీంతో చాలా మంది నీరు తాగే అలవాటుపై పెద్దగా శ్రద్ధ చూపరు. కానీ శరీరంకి తగినంత నీళ్లు అందకపోతే అది..

Kidney Stones: తక్కువ నీళ్లు తాగితే కిడ్నీల్లో రాళ్లు వస్తాయా? ఈ డౌట్ మీకూ ఉందా..
Kidney Stone Risk
Srilakshmi C
|

Updated on: Jan 24, 2026 | 9:01 PM

Share

కొంతమందికి నీళ్లు తాగడం అంటేనే అలెర్జీ. మాటిమాటికీ మూత్రంకి వెళ్లవల్సి వస్తుందని నీళ్లు తాగడం మానుకుంటూ ఉంటారు. నీళ్లు తాగకపోవడానికి ఒత్తిడితో కూడిన జీవితం, పని చింతలు, దాహం లేకపోవడం వంటి ప్రధాన కారణాలు కూడా ఉన్నాయి. దీంతో చాలా మంది నీరు తాగే అలవాటుపై పెద్దగా శ్రద్ధ చూపరు. కానీ శరీరంకి తగినంత నీళ్లు అందకపోతే అది అనేక తీవ్రమైన ఆరోగ్య సమస్యలను ఆహ్వానిస్తుంది. నీళ్లు శరీరం నుంచి మలినాలను బయటకు పంపడంలో సహాయపడుతుంది. కానీ ఒంట్లో నీళ్ల పరిమాణం తగ్గినప్పుడు శరీర సమతుల్యత చెదిరిపోవడం ప్రారంభమవుతుంది. ప్రారంభంలో దాని లక్షణాలు తేలికగా ఉండటంతో వీటిని విస్మరిస్తారు. క్రమంగా ఈ సమస్య పెరుగుతుంది. తరువాత అది మూత్రపిండాల్లో రాళ్లుగా అభివృద్ధి చెందుతుంది. తక్కువ నీళ్లు తాగే అలవాటు మూత్రపిండాల్లో రాళ్లకు ఎలా దారితీస్తుందో, దాని లక్షణాలు ఏమిటో, ఎలా నివారించాలో ఇక్కడ తెలుసుకుందాం..

తక్కువ నీళ్లు తాగే అలవాటు మూత్రపిండాల్లో రాళ్లకు ఎలా దారితీస్తుంది?

శరీరానికి తగినంత నీళ్లు అందనప్పుడు, మూత్రం పరిమాణం తగ్గుతుందని సఫ్దర్‌జంగ్ హాస్పిటల్ నెఫ్రాలజీ విభాగం డాక్టర్ హిమాన్షు వర్మ అంటున్నారు. ఇది మూత్రపిండాలలో ఖనిజాలు, లవణాలు సరిగ్గా విసర్జించబడకుండా నిరోధిస్తుంది. దీంతో ఇవి క్రమంగా పేరుకుపోవడం ప్రారంభమవుతాయి. ఈ పేరుకుపోయిన పదార్థాలు చివరికి మూత్రపిండాల్లో రాళ్లను ఏర్పరుస్తాయి. తరచూ తక్కువగా నీళ్లు తాగడం వల్ల మూత్రం కేంద్రీకృతమవుతుంది. రాళ్లు ఏర్పడే అవకాశాలు పెరుగుతాయి. తక్కువ చెమట పట్టేవారిలో, ఉప్పు – ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారం తీసుకునే వ్యక్తులలో ఈ రకమైన ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అలాగే ఎక్కువసేపు మూత్రాన్ని పట్టి ఉంచడం, శీతాకాలంలో తక్కువ నీళ్లు తాగడం కూడా మూత్రపిండాల్లో రాళ్లకు ప్రమాద కారకాలు కావచ్చు.

శరీరంలో నీళ్లు లేకపోవడం వల్ల కనిపించే లక్షణాలు

నీటి కొరత ఉన్నప్పుడు శరీరం అనేక సంకేతాలను ఇవ్వడం ప్రారంభిస్తుంది. తరచుగా అలసట, నోరు ఎండిపోవడం, తలనొప్పి సాధారణ లక్షణాలు. ముదురు పసుపు రంగు మూత్రం కూడా నిర్జలీకరణానికి ఒక సంకేతం. కొంతమందికి తలతిరుగడం, మలబద్ధకం, పొడి చర్మం కూడా ఉండవచ్చు. ఈ నీటి కొరత చాలా కాలం పాటు కొనసాగితే అది మూత్రపిండాల సంబంధిత సమస్యలు, పొత్తి కడుపు లేదా నడుము దిగువ భాగంలో నొప్పికి దారితీస్తుంది.

ఇవి కూడా చదవండి

ఎలా నివారించాలి?

  • రోజూ పుష్కలంగా నీళ్లు తాగాలి.
  • దాహం వేయకముందే నీళ్లు తాగడం అలవాటు చేసుకోవాలి.
  • శీతాకాలంలో కూడా నీళ్లు తీసుకోవడం తగ్గించకూడదు.
  • అధిక ఉప్పు, జంక్ ఫుడ్ తీసుకోవడం మానుకోవాలి.
  • మూత్రం ఎక్కువ సమయం అదుపు చేసుకునే అలవాటు మానేయాలి.

మరిన్ని ఆరోగ్య కథనాల కోసం క్లిక్‌ చేయండి.