
కొంతమందికి గుమ్మడి గింజలు తినటం వల్ల అలెర్ సమస్యలు తలెత్తుతాయి. గుమ్మడి గింజలు అలెర్జీలను కలిగిస్తాయి. గొంతు నొప్పి, తుమ్ములు వస్తాయి. అలాంటి వ్యక్తులు గుమ్మడి గింజలను తీసుకునే ముందు వారి వైద్యుడిని సంప్రదించాలి.గుమ్మడి గింజలు తరచుగా తినడం వల్ల కొన్ని దుష్ప్రభావాలు కలుగుతాయి. గుమ్మడి గింజల్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఎక్కువగా తింటే కడుపు నొప్పి, విరేచనాలు వస్తాయి. గుమ్మడి గింజలు కొంతమందిలో బరువు పెరగడానికి కారణం అవుతాయి.
గుమ్మడికాయ గింజల్లో పొటాషియం, మెగ్నీషియం ఉంటాయి. ఇవి అధిక రక్తపోటుకు హానికరం. అందువల్ల, అధిక రక్తపోటు ఉన్నవారు గుమ్మడికాయ గింజలను తీసుకునే ముందు వారి వైద్యుడిని సంప్రదించాలి. గుమ్మడి గింజలు తరచుగా తినడం వల్ల కొంతమందిలో బీపీ తగ్గుతుంది. చిన్న పిల్లలకు గుమ్మడి గింజలు ఇవ్వకూడదు. అవి గొంతులో ఇరుక్కుపోవచ్చు. పెద్దలు కూడా వాటిని బాగా నమిలి తినాలి.
గుమ్మడికాయ గింజల్లో నూనె ఉంటుంది. ఇది కొలెస్ట్రాల్ సమస్యలు ఉన్నవారికి మంచిది కాకపోవచ్చు. సెలియాక్ వ్యాధి ఉన్న కొంతమంది గ్లూటెన్ ద్వారా ప్రభావితమవుతారు. గుమ్మడికాయ గింజలలో కూడా గ్లూటెన్ ఉండవచ్చు. కాబట్టి సెలియాక్ వ్యాధి ఉన్నవారు గుమ్మడికాయ గింజలకు దూరంగా ఉండాలి. మీరు గుమ్మడికాయ గింజలను ఎక్కువగా తినకూడదు. ఎందుకంటే ఈ గింజలు కేలరీలు అధికంగా ఉంటాయి. ఎక్కువ మొత్తంలో తింటే వేగంగా బరువు పెరగడానికి దారితీస్తుంది. గుమ్మడి గింజలు అధికంగా తీసుకుంటే అవి విరేచనాలకు కారణమవుతాయి. అవి కడుపు నొప్పి, తిమ్మిర్లు, ఉబ్బరం కూడా కలిగిస్తాయి. అంతేకాకుండా, అవి కడుపు నొప్పిని కూడా కలిగిస్తాయి.
మరిన్ని లైఫ్స్టైల్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..