దోశలు అంటే చాలా మందికి ఇష్టం. దోశల్లో చాలా రకాలు ఉంటాయి. ఇంట్లో కూడా చాలా రకాలుగా దోశలు వేస్తూ ఉంటారు. ఎక్కువగా చాలా మందికి ఘీ కారం దోశలు, మసాలా దోశలు అంటే ఇష్టం. కానీ మనం ఆలు గడ్డలతో కూడా దోశలు చేసుకోవచ్చు. ఇవి క్రిస్పీగా, సాఫ్ట్ గా ఉంటాయి. నోట్లో వేస్తే కరిగిపోతాయి. చాలా సింపుల్గా, తక్కువ సమయంలోనే తయారు చేసుకోవచ్చు. అందులోనూ బంగాళదుంపలు అంటే ఇష్టం ఉన్నవారు ఈ అట్లను ఖచ్చితంగా తినాల్సిందే. మరి ఆలు గడ్డలతో దోశలు ఎలా తయారు చేస్తారు? ఈ దోశలు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
ఉడకబెట్టిన ఆలు, ఉల్లి పాయలు, పచ్చి మిర్చి, ఉప్మా రవ్వ, బియ్యం పిండి, ఉప్పు, కొత్తిమీర, కరివేపాకు, జీలకర్ర, నెయ్యి లేదా ఆయిల్.
ముందుగా ఆలు గడ్డలను మెత్తగా ఉడికించుకోవాలి. ఉడక బెట్టి ఆలూ, కొద్దిగా వాటర్ మిక్సీలో వేసి మెత్తని పేస్టులా చేసుకోవాలి. ఈ పేస్టును ఒక బౌల్లోకి తీసుకోండి. ఇందులో బియ్యం పిండి, ఉప్మా రవ్వ, ఉప్పు కూడా వేసి కలుపుకోవాలి. ఉండలు లేకుండా.. చక్కగా మొత్తం అంతా కలిసేలా కలపాలి. పిండి చిక్కగా ఉంటే మరిన్ని వాటర్ వేయవచ్చు. అచ్చం దోశ బ్యాటర్లా ఉండాలి. ఆ తర్వాత ఇందులోనే ఉల్లి పాయలు, పచ్చి మిర్చి, కొత్తిమీర, కరివేపాకు, జీలకర్ర, కావాలి అనుకుంటే క్యారెట్ తురుము కూడా వేయండి.
ఇప్పుడు ఈ పిండిని ఓ గంట లేదా అరగంట పాటు పక్కన పెడితే చాలు. ఆ తర్వాత పెనం వేడి చేసుకుని.. దోశలుగా పోసుకోండి. నెయ్యి లేదా ఆయిల్తో కాల్చుకోండి. అంతే ఎంతో రుచిగా ఉండే ఆలు దోశలు సిద్ధం. ఇవి చాలా రుచిగా ఉంటాయి. తక్కువు సమయంలోనే తయారు చేసుకోవచ్చు.