
వినాయక చవితిలో గణపయ్యకి సమర్పించే ఆహారం ప్రధాన పాత్ర పోషిస్తుంది. నైవేద్యంగా సమర్పించే ఆహారంలో ఎక్కువగా బియ్యం పిండితో చేసినవే ఉంటాయి. చవితికి తప్పనిసరిగా చేసే వాటిలో ఒకటి మోదకం. దీనిని ఆంధ్ర, తమిళనాడు, కేరళ వంటి వివిధ ప్రాంతాల్లో వివిధ రకాలుగా తయారు చేస్తారు. ఈ రోజు గణపయ్యకు ఇష్టమైన తమిళనాడు తరహాలో చేసే కొజుకట్టై రెసిపీ గురించి తెలుసుకుందాం..
తయారీ విధానం: స్టవ్ మీద బాణలి పెట్టి తురిమిన కొబ్బరి, బెల్లం వేసి బాగా కలపండి. తర్వాత నెయ్యి, యాలకుల పొడి వేసి.. ఈ మిశ్రమాన్ని బాగా ఉడికించండి. తర్వాత స్టవ్ మీద నుంచి బాణలి తీసి పక్కకు పెట్టండి. చల్లారిన తర్వాత మీడియం సైజ్ లో ఉండలు చుట్టుకోవాలి.
ఇంతలో మళ్ళీ మరొక గిన్నె తీసుకుని కప్పుమ్పావు నీరు పోసి.. నెయ్యి, కొంచెం ఉప్పు, కొంచెం బెల్లం పొడి వేసి నీరు మరిగించండి. నీరు మరిగిన తర్వత ఇందులో బియ్యం పొడి వేసి బాగా కలపాలి. ఈ బియ్యం పిండి మిశ్రమాన్ని బాగా కలిపి .. పెద్ద బంతి సైజ్ లో ఉండ చేసి.. దాని మద్యలో కొబ్బరి బెల్లం మిశ్రమ ఉండని పెట్టి.. ఈ స్టఫింగ్ ని బియ్యం పిండి మిశ్రమంతో కవర్ చేయండి. ఇలా అన్నిటిని చేసుకోవాలి.
ఇంతలో స్టవ్ మీద స్టీమర్ లేదా ఇడ్లీ పాత్రని పెట్టి పెట్టి.. అందులో తగినంత నీరు పోసి వేడి చేయాలి.. రెడీ చేసుకున్న కొజుకట్టై ఉండలను ఒక ప్లేట్ లో పెట్టి.. స్టీమర్ లో లేదా ఇడ్లీ పాత్రలో పెట్టి.. మీడియం మంట 10-15 నిమిషాలు ఆవిరికి ఉడికించండి. అంతే వినాయకుడికి సమర్పించడానికి కొజ్జుకట్టై సిద్ధంగా ఉంది.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..