AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దేవుడి దర్శనం తర్వాత గుడిలో కాసేపు ఎందుకు కూర్చుంటారో మీకు తెలుసా..?

ఆలయాలకు వెళ్లిన భక్తులు దేవుడి దర్శనం తర్వాత కాసేపు అక్కడ కూర్చుని వస్తారు. అందరు దీన్ని పాటిస్తుంటారు. దేవుడి దర్శనం తర్వాత కాసేపు కూర్చుని బయటకు రావడం వెనుక ఉన్న కారణం ఏంటో మీకు తెలుసా? తెలియకపోతే ఈ స్టోరీలో అది తెలుసుకుందాం.

దేవుడి దర్శనం తర్వాత గుడిలో కాసేపు ఎందుకు కూర్చుంటారో మీకు తెలుసా..?
Temple
Krishna S
|

Updated on: Jul 23, 2025 | 10:07 PM

Share

మంచి జరిగినా.. చెడు జరిగినా మనకు వెంటనే గుర్తొచ్చేది దేవుడు. ఏదైనా చెడు జరిగితే.. మనశ్శాంతి పొందడానికి ఆలయానికి వెళ్తాం. ఏదైనా మంచి జరిగినప్పుడు.. దేవునికి కృతజ్ఞతలు చెప్పడానికి ఆలయాన్ని సందర్శిస్తాం. ఈ విధంగా ప్రతి ఒక్కరూ మనశ్శాంతి కోసం ఆలయాన్ని సందర్శిస్తారు. దేవుని దర్శనం చేసుకున్న తర్వాత అక్కడ కొంతసేపు కూర్చుని బయటకు వస్తారు. దేవుని దర్శనం చేసుకున్న తర్వాత బయటకు వచ్చే ముందు అందరూ ఆలయంలో ఎందుకు కొంతసేపు కూర్చుంటారో మీకు తెలుసా? దీని వెనుక ఉన్న కారణాన్ని తెలుసుకుందాం..

హిందూ సంప్రదాయంలో.. దేవుడి దర్శనం చేసుకున్న తర్వాత బయటకు వచ్చే ముందు ఆలయ ప్రాంగణంలో కొంతసేపు కూర్చోవడం ఒక ఆచారం. దీని వెనుక కూడా ఒక కారణం ఉంది. మీరు ఆలయాన్ని సందర్శించి దేవుడి దర్శనం తర్వాత వెంటనే బయటకు వెళితే, మనశ్శాంతి లభించదు. కానీ దర్శనం తర్వాత కొంతసేపు కూర్చోని దేవుడిని స్మరిస్తే మనసులోని ఆందోళన పోతుంది. మనస్సు తేలికగా మారుతుంది. అదనంగా ఆలయంలోని సానుకూల శక్తి మనలోకి ప్రవేశిస్తుందని. ఇది మన ఆరోగ్యాన్ని పెంపొందిస్తుందని శాస్త్రం చెబుతోంది.

సానుకూల శక్తిని పొందడానికి:

దేవాలయాలను శక్తికి గొప్ప కేంద్రాలుగా చెప్తారు. అందువల్ల దేవుడిని దర్శనం చేసుకున్న తర్వాత ఆలయం నుండి బయటకు వచ్చే ముందు కొంతసేపు అక్కడ కూర్చోవడం వల్ల మీ మనస్సు అక్కడ సానుకూల శక్తిని గ్రహించడంలో సహాయపడుతుంది. అదనంగా మన కోపం, అహంకార భావాలు మాయమవుతాయి.

మానసిక ప్రశాంతత:

మనం ఆలయంలో కూర్చుని మన మనస్సులో దేవుడిని స్మరించినప్పుడు.. మన సంబంధం నేరుగా పరమాత్మతో ఉంటుంది. అప్పుడు మన మనస్సు సానుకూలతతో నిండి ఉంటుంది. ఈ సందర్భంలో అన్ని ఒత్తిడి, ఆందోళన ఒక క్షణం మాయమై మనకు మానసిక ప్రశాంతత లభిస్తుంది. అందుకే దర్శనం తర్వాత కొంత సమయం ఆలయంలో కూర్చోవాలి.

ఎందుకు కూర్చోవాలి..?

దేవుని దర్శనం తర్వాత, మనం కొంత సమయం ఆలయంలో ఏకాంతంగా కూర్చోవాలి. ఈ సమయంలో మీరు దేవుడిని మౌనంగా స్మరించడం మంచిది. ఈ సంప్రదాయం వెనుక ఉన్న శాస్త్రీయ కారణం ఏమిటంటే.. ఆలయంలో చాలా సానుకూల శక్తి ఉంటుంది. మనం కొంత సమయం ఆలయంలో నిశ్శబ్దంగా కూర్చున్నప్పుడు, ఈ సానుకూల శక్తి మన శరీరంలోకి ప్రవేశిస్తుంది. ఇది మనకు శక్తిని ఇస్తుంది.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..