
ప్రస్తుత కాలంలో డయాబెటీస్ అనేది మహమ్మారిలా మారిపోయింది. యంగ్ ఏజ్లో ఉన్నవారికి సైతం షుగర్ వ్యాధి వచ్చేస్తుంది. షుగర్ వ్యాధి ఒక్కసారి వచ్చిందంటే తగ్గడం ఉండదు. కేవలం కంట్రోల్ మాత్రమే చేసుకోవాలి. డయాబెటీస్తో బాధ పడేవారు చాలా ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. ఆహారాన్ని ఖచ్చితంగా కంట్రోల్ చేసుకోవాలి. డయాబెటీస్ను కంట్రోల్ కాకపోతే.. కంటి సమస్యలు, కండరాల సమస్యలు, గుండె జబ్బులు, కిడ్నీ సమస్యలు వంటివి ఎటాక్ చేస్తాయి. కాబట్టి షుగర్ వ్యాధిని అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు. ప్రస్తుతం ఇప్పుడున్న లైఫ్ స్టైల్ వల్ల ఈ వ్యాధి వస్తుంది. ముఖ్యంగా మహిళల్లో డయాబెటీస్ ఎటాక్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. సరైన నిద్ర, ఆహారం లేకుండా ఒత్తిడిని అధికంగా తీసుకున్నా డయాబెటీస్ ముప్పు ఎక్కువగా ఉంది.
అయితే ఈ వ్యాధిని కంట్రోల్ చేయాలంటే శ్రమించాల్సిందే. ముఖ్యంగా చాలా మంది ట్యాబ్లెట్స్ వేసుకుంటూ ఉంటారు. కానీ ట్యాబ్లెట్స్ వాడకుండా కూడా డయాబెటీస్ను కంట్రోల్ చేయవచ్చు. ఆహారపు అలవాట్లు, లైఫ్ స్టైల్లో మార్పుల ద్వారా డయాబెటీస్ సమస్యను తగ్గించుకోవచ్చు. ఇందు కోసం కొన్ని హోమ్ రెమిడీస్ పాటిస్తే చాలు. ఆచరించడం కష్టమే అయినా చివరికి మంచి ఫలితాలు కనిపిస్తాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ముందుగా పాలతో చేసినా కాఫీ, టీలు తాగడం మానేయండి. బ్లాక్ టీ ఎక్కువగా గ్రీన్ టీ తీసుకోవడం చాలా మంచిది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి కాబట్టి.. షుగర్ లెవల్స్ను అదుపులో ఉంచుతుంది. శక్తిని కూడా అందిస్తుంది.
త్వరగా, తేలికగా జీర్ణం అయ్యే ఆహారాలు, ఫైబర్ రిచ్ ఫుడ్స్ తీసుకోవాలి. ఇవి రక్తంలో షుగర్ లెవల్స్ని పెంచకుండా అదుపులో ఉంచుతుంది. షుగర్ ఫుట్స్, స్వీట్స్, స్వీట్ ఎక్కువగా పండ్లు, కూరగాయలు, జంక్ ఫుడ్కి దూరంగా ఉండాలి. తృణధాన్యాలు, ఆకు కూరలు తీసుకోవాలి. మంచి నీటిని ఎక్కువగా తాగాలి. వైద్యుల సలహాతో ఇలా చేస్తే మంచి ఫలితం ఉంటుంది.
(NOTE: ఇంటర్నెట్లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..