AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Egg: గుడ్లు తింటే క్యాన్సర్ వస్తుందా.. అపొహలు కాదు అసలు నిజాలు తెలుసుకోండి..

తక్కువ ధరలో ఎక్కువ పోషకాలు లభించే ఆహారం ఏదైనా ఉందంటే అది గుడ్డు మాత్రమే.. కానీ గత కొన్ని రోజులుగా గుడ్డు చుట్టూ రకరకాల పుకార్లు షికారు చేస్తున్నాయి. ఈ ప్రచారం వల్ల చాలామంది గుడ్లు తినడమే మానేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే డైటీషియన్లు, ఆహార భద్రతా సంస్థ కీలక విషయాలను వెల్లడించాయి. గుడ్డు గురించి వారు ఏం చెప్పారన్నది ఈ స్టోరీలో తెలుసుకుందాం..

Egg: గుడ్లు తింటే క్యాన్సర్ వస్తుందా.. అపొహలు కాదు అసలు నిజాలు తెలుసుకోండి..
Do Eggs Cause Cancer
Krishna S
|

Updated on: Jan 18, 2026 | 8:07 AM

Share

గత కొన్ని రోజులుగా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో గుడ్లకు సంబంధించి ఒక వార్త విపరీతంగా వైరల్ అవుతోంది. గుడ్లు తినడం వల్ల ఆరోగ్యానికి, ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులకు తీవ్ర ప్రమాదం ఉందని, అది క్యాన్సర్‌కు దారితీస్తుందని జరుగుతున్న ప్రచారం సామాన్యులను ఆందోళనకు గురిచేస్తోంది. ఈ నేపథ్యంలో ఫరీదాబాద్‌లోని సర్వోదయ ఆసుపత్రి చీఫ్ డైటీషియన్ డాక్టర్ మీనా కుమారి ఈ పుకార్లపై స్పందించి వాస్తవాలను వెల్లడించారు. డాక్టర్ మీనా కుమారి వివరణ ప్రకారం, గుడ్లు అత్యంత సురక్షితమైనవి, చౌకగా లభించే పోషకాహారం. గుడ్లలో ఉండే హై-క్వాలిటీ ప్రోటీన్ కండరాల నిర్మాణానికి తోడ్పడుతుంది. విటమిన్ ఎ, డి, ఇ, బి12, సెలీనియం వంటి ముఖ్యమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇందులో ఉండే కోలిన్ మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది. శరీరానికి అవసరమైన ఇమ్యూనిటీని పెంచడంలో గుడ్డు కీలక పాత్ర పోషిస్తుంది. అందుకే రోగులకు, పిల్లలకు నిరభ్యంతరంగా గుడ్లు ఇవ్వవచ్చని ఆమె స్పష్టం చేశారు.

ఏమిటీ AOZ రసాయనం?

సోషల్ మీడియాలో చర్చ జరుగుతున్న AOZ గురించి డాక్టర్ స్పష్టత ఇచ్చారు. AOZ అనేది నైట్రోఫ్యూరాన్ అనే యాంటీబయాటిక్ అవశేషం. అయితే భారత్, అమెరికా, యూరోపియన్ యూనియన్ దేశాల్లో కోళ్ల ఫారాలలో నైట్రోఫ్యూరాన్ వాడకంపై పూర్తి నిషేధం ఉంది. కాబట్టి సాధారణంగా లభించే గుడ్లలో ఇది ఉండే అవకాశం లేదని ఆమె తేల్చి చెప్పారు. భారత ఆహార భద్రత, ప్రమాణాల ప్రాధికార సంస్థ కూడా దీనిపై స్పందించింది. కొన్ని అరుదైన సందర్భాల్లో చాలా తక్కువ స్థాయిలో వీటి జాడలు కనిపించినా, అవి మానవ ఆరోగ్యానికి ప్రమాదకరం కాదని, క్యాన్సర్ వంటి వ్యాధులకు కారణం కావని స్పష్టం చేసింది.

రోజుకు ఎన్ని గుడ్లు తినవచ్చు?

శాస్త్రీయ అధ్యయనాల ప్రకారం.. గుడ్లు తినడానికి, క్యాన్సర్‌కు ఎటువంటి సంబంధం లేదు. క్యాన్సర్ అనేది ప్రధానంగా జీవనశైలి, ధూమపానం, ఊబకాయం వంటి కారణాల వల్ల వస్తుంది. ఆరోగ్యవంతులు: రోజుకు 1 నుండి 2 గుడ్లు తినవచ్చు. మధుమేహం లేదా గుండె సమస్యలు ఉన్నవారు డాక్టర్ లేదా డైటీషియన్ సలహాతో, తమ కొలెస్ట్రాల్ స్థాయిని బట్టి పరిమితంగా తీసుకోవాలి. ఐసియులో ఉన్న రోగులకు, క్యాన్సర్ బాధితులకు కూడా కోలుకోవడానికి అవసరమైన ప్రోటీన్ కోసం గుడ్లను ఆహారంగా ఇస్తారని డాక్టర్ మీనా కుమారి గుర్తుచేశారు. సోషల్ మీడియాలో వచ్చే నిరాధారమైన వార్తలను నమ్మి పౌష్టికాహారానికి దూరం కావద్దని నిపుణులు సూచిస్తున్నారు. గుడ్డు ఆరోగ్యానికి రక్షణ కవచమే తప్ప ప్రమాదకారి కాదు.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
హరారేలో జెండా పాతేందుకు సిద్ధమైన ప్రభ్‌సిమ్రన్, హర్ష్, అశోక్
హరారేలో జెండా పాతేందుకు సిద్ధమైన ప్రభ్‌సిమ్రన్, హర్ష్, అశోక్
భారీగా పెరగనున్న స్మార్ట్‌ఫోన్, ల్యాప్‌టాప్ ధరలు
భారీగా పెరగనున్న స్మార్ట్‌ఫోన్, ల్యాప్‌టాప్ ధరలు
ఇందిరమ్మ ఇళ్లపై బిగ్‌ అప్‌డేట్.. రెండో విడతలో వారికే ఫస్ట్!
ఇందిరమ్మ ఇళ్లపై బిగ్‌ అప్‌డేట్.. రెండో విడతలో వారికే ఫస్ట్!
రైల్వే జాబ్స్‌ కోసం ఎదురుచూస్తున్నారా? RRB నుంచి మరో నోటిఫికేషన్
రైల్వే జాబ్స్‌ కోసం ఎదురుచూస్తున్నారా? RRB నుంచి మరో నోటిఫికేషన్
విజయ్ చివరి సినిమా జన నాయగన్ రిలీజ్..అడియన్స్ రియాక్షన్స్
విజయ్ చివరి సినిమా జన నాయగన్ రిలీజ్..అడియన్స్ రియాక్షన్స్
మూతపడ్డ సోషల్ మీడియా సెన్సేషన్‌ RAW ఎన్టీఆర్..! కారణం అదేనా..
మూతపడ్డ సోషల్ మీడియా సెన్సేషన్‌ RAW ఎన్టీఆర్..! కారణం అదేనా..
ఆస్పత్రి నుంచి ట్రైనీ IPS ఉదయ్‌ కృష్ణ డిశ్చార్జ్..
ఆస్పత్రి నుంచి ట్రైనీ IPS ఉదయ్‌ కృష్ణ డిశ్చార్జ్..
నేడే ఫస్ట్ టీ20.. హరారే పిచ్ రిపోర్ట్, వాతావరణం ఎలా ఉందంటే?
నేడే ఫస్ట్ టీ20.. హరారే పిచ్ రిపోర్ట్, వాతావరణం ఎలా ఉందంటే?
తల్లికి వందనం పథకంపై ఏపీ ప్రభుత్వం అప్డేట్.. డబ్బులు పడకపోతే..
తల్లికి వందనం పథకంపై ఏపీ ప్రభుత్వం అప్డేట్.. డబ్బులు పడకపోతే..
తెలుగు రాష్ట్రాలకు బిగ్‌ అలర్ట్.. నేడు భారీ వర్షాలు ఈ జిల్లాల్లో
తెలుగు రాష్ట్రాలకు బిగ్‌ అలర్ట్.. నేడు భారీ వర్షాలు ఈ జిల్లాల్లో