బాపినీడు మృతి బాధ కలిగించింది -చిరంజీవి

| Edited By: Ram Naramaneni

Oct 12, 2020 | 4:43 PM

హైదరాబాద్: సినీ దర్శకుడు, పాత్రికేయుడు,  రచయిత విజయ బాపినీడు మృతి చెందిన విషయం తెలిసిందే. ఆయన మృతి పట్ల సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి.. బాపినీడు భౌతికకాయాన్ని సందర్శించి నివాళి అర్పించారు. బాపినీడు చిరంజీవితోనే ఎక్కువ సినిమాలు తెరకెక్కించారు. చిరంజీవి హీరోగా వచ్చిన ‘మగ మహారాజు’తో ఆయన మెగాఫోన్ పట్టారు. అనంతరం మహానగరంలో మాయగాడు, మగధీరుడు, ఖైదీ నంబర్ 786, గ్యాంగ్ లీడర్, బిగ్ బాస్ వంటి బ్లాక్ బస్టర్ హిట్స్‌ను […]

బాపినీడు మృతి బాధ కలిగించింది -చిరంజీవి
Follow us on
హైదరాబాద్:
సినీ దర్శకుడు, పాత్రికేయుడు,  రచయిత విజయ బాపినీడు మృతి చెందిన విషయం తెలిసిందే. ఆయన మృతి పట్ల సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి.. బాపినీడు భౌతికకాయాన్ని సందర్శించి నివాళి అర్పించారు. బాపినీడు చిరంజీవితోనే ఎక్కువ సినిమాలు తెరకెక్కించారు. చిరంజీవి హీరోగా వచ్చిన ‘మగ మహారాజు’తో ఆయన మెగాఫోన్ పట్టారు.
అనంతరం మహానగరంలో మాయగాడు, మగధీరుడు, ఖైదీ నంబర్ 786, గ్యాంగ్ లీడర్, బిగ్ బాస్ వంటి బ్లాక్ బస్టర్ హిట్స్‌ను ఇండస్ట్రీకి అందించారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ.. ‘‘విజయ బాపినీడు మృతి బాధ కలిగించింది. ఆయనతో ఆరు సినిమాలు చేశా. ఆయన నన్ను సొంత తమ్ముడిలా ఆదరించారు, ఆయన లేని లోటు పూడ్చలేనిది. బాపినీడు కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా’’ అన్నారు.