AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆ గ్రామానికి చేరని ఉల్లి ఘాటు.. ఎందుకంటే..?

ఉల్లి కోయకుండా.. ఘాటు మండిపోతుంది. ఉల్లి ధరలను చూసి అటు ప్రభుత్వాలు, ఇటు ప్రజలు వణికిపోతున్నారు. ప్రస్తుతం ఉల్లి కేజీ రూ. 100పైగా పలుకుతుండగా.. దాని ఘాటును తగ్గించి సబ్సిడీ మీద ఉల్లిని ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ రోజుల్లో ఆ వెరైటీ వింత తెలుసుకోవాలంటే  బీహార్ రాష్ట్రానికి వెళ్లాల్సిందే. బీహార్‌లోని జెహనాబాద్ జిల్లాలో ఉందీ త్రిలోకీబీగా అనే గ్రామం ఒకటి ఉంది. ఆ గ్రామానికి చెందిన ప్రజలు మాత్రం ఉల్లి రూ.500కు చేరినా.. తమకు ఎలాంటి […]

ఆ గ్రామానికి చేరని ఉల్లి ఘాటు.. ఎందుకంటే..?
Ravi Kiran
|

Updated on: Dec 05, 2019 | 2:28 PM

Share

ఉల్లి కోయకుండా.. ఘాటు మండిపోతుంది. ఉల్లి ధరలను చూసి అటు ప్రభుత్వాలు, ఇటు ప్రజలు వణికిపోతున్నారు. ప్రస్తుతం ఉల్లి కేజీ రూ. 100పైగా పలుకుతుండగా.. దాని ఘాటును తగ్గించి సబ్సిడీ మీద ఉల్లిని ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ రోజుల్లో ఆ వెరైటీ వింత తెలుసుకోవాలంటే  బీహార్ రాష్ట్రానికి వెళ్లాల్సిందే. బీహార్‌లోని జెహనాబాద్ జిల్లాలో ఉందీ త్రిలోకీబీగా అనే గ్రామం ఒకటి ఉంది. ఆ గ్రామానికి చెందిన ప్రజలు మాత్రం ఉల్లి రూ.500కు చేరినా.. తమకు ఎలాంటి దిగులు లేదని అంటున్నారు.

ఆ గ్రామ జనాభా సుమారు 400 మంది మాత్రమే. వాళ్ళందరూ కూడా కొన్ని ఏళ్ళ నుంచి ఉల్లి, వెల్లుల్లి తినరట. ఇలా తినకపోవడానికి కూడా ఓ కారణం ఉందని తెలుస్తోంది. ఆ ఊరిలో వెంకటేశ్వర స్వామి ఆలయం ఉందని… ఆ వెంకన్నను కొలిచే గ్రామస్థులు ఉల్లి, వెల్లుల్లి తినడం మాత్రమే కాదు.. మద్యం కూడా ముట్టుకోరని సమాచారం. ఇక ఈ ఆచారం ఇప్పటిది కాదట.. దాదాపు శతాబ్దాల కిందట నుంచి ఆ గ్రామంలో కొనసాగుతోందని వినికిడి.

మరోవైపు ఉల్లి, వెల్లుల్లి తినాలని కొందరు ప్రయత్నించి.. ప్రాణాల మీదకు తెచ్చుకున్నారని సమాచారం. దీంతో ఎవరూ కూడా మళ్ళీ తినడానికి ధైర్యం చేయలేదని తెలుస్తోంది. ఇక ఈ ఆచారాన్ని ఇప్పటికీ వారంతా పాటించడంతో.. ఉల్లి ఘాటు ఎంత ఉన్నా.. తమకు ఏమి కాదని చెబుతున్నారు.