వెంకటేశ్, నాగ చైతన్య హీరోలుగా దర్శకుడు బాబీ తెరకెక్కిస్తోన్న చిత్రం ‘వెంకీ మామ’. గతేడాది పూజా కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రం తాజాగా సెట్స్ మీదకు వెళ్లింది. రాజమండ్రిలో ఈ మూవీ షూటింగ్ ప్రారంభం అవ్వగా.. అందులో బుధవారం జాయిన్ అయ్యాడు వెంకటేశ్. మరోవైపు మజిలీలో బిజీగా ఉన్న నాగ చైతన్య.. త్వరలో ఈ మూవీ షూటింగ్లో పాల్గొనబోతున్నట్లు తెలుస్తోంది.
కాగా ఈ చిత్రంలో వెంకటేశ్ సరసన పాయల్ రాజ్పుత్, చైతూ సరసన రకుల్ ప్రీత్ సింగ్లు కనిపించనున్నారు. ఫుల్ కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని సురేశ్ ప్రొడక్షన్స్, ప్యూపుల్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మించనున్న ఈ చిత్రాన్ని ఈ ఏడాదే ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.