సీఎం జగన్కు అమిత్ షా ఫోన్..
ఏపీ సీఎం జగన్ కు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఫోన్ చేశారు. ప్రస్తుతం అమలవుతోన్న లాక్ డౌన్ పరిణామాలు.. ఆ తర్వాత ఎటువంటి చర్యలు తీసుకోవాలి అన్న అంశాలపై చర్చించారు. కరోనా కట్టడికి ఏపీ సర్కార్ తీసుకుంటున్న చర్యల్ని హోంమంత్రికి.. సీఎం జగన్ వివరించారు. ప్రతి మిలియన్ జనాభాకు ఎక్కువ టెస్టులు చేసిన రాష్ట్రంగా ఏపీ ఫస్ట్ ప్లేస్ లో ఉందని.. సీఎం.. అమిత్ షాకు తెలిపారు. ఈ విషయాన్ని ఏపీ సీఎం ఆఫీస్ ట్విట్టర్ […]

ఏపీ సీఎం జగన్ కు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఫోన్ చేశారు. ప్రస్తుతం అమలవుతోన్న లాక్ డౌన్ పరిణామాలు.. ఆ తర్వాత ఎటువంటి చర్యలు తీసుకోవాలి అన్న అంశాలపై చర్చించారు. కరోనా కట్టడికి ఏపీ సర్కార్ తీసుకుంటున్న చర్యల్ని హోంమంత్రికి.. సీఎం జగన్ వివరించారు. ప్రతి మిలియన్ జనాభాకు ఎక్కువ టెస్టులు చేసిన రాష్ట్రంగా ఏపీ ఫస్ట్ ప్లేస్ లో ఉందని.. సీఎం.. అమిత్ షాకు తెలిపారు. ఈ విషయాన్ని ఏపీ సీఎం ఆఫీస్ ట్విట్టర్ లో వెల్లడించింది.
సీఎం శ్రీ వైయస్.జగన్కు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఫోన్. లాక్డౌన్ పరిణామాలు, తర్వాత అనుసరించాల్సిన వ్యూహంపైనా చర్చ. రాష్ట్రంలో తీసుకుంటున్న చర్యలను వివరించిన సీఎం. ప్రతి మిలియన్ జనాభాకు అత్యధిక పరీక్షలు నిర్వహించిన రాష్ట్రంగా ప్రథమ స్థానంలో ఉన్నామన్న సీఎం.
— CMO Andhra Pradesh (@AndhraPradeshCM) April 26, 2020
మరోవైపు ఏపీలో కరోనా టెన్షన్ క్రియేట్ చేస్తోంది. తాజాగా పాజిటివ్ కేసులు సంఖ్య 1097కు చేరాయి. ఈరోజు మార్నింగ్ ప్రభుత్వం రిలీజ్ చేసిన హెల్త్ బులిటెన్ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో 81 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి.
