అస్సాం ఎన్నార్సీ… మోదీ సెకండ్ స్ట్రాటజీ

అస్సాంలో 19 లక్షల మంది పేర్లను నేషనల్ సిటిజన్స్ లిస్ట్ (ఎన్ ఆర్ సీ ) లో తొలగించారు. లీగల్ గా ఈ రాష్ట్రంలో ఉంటున్నవారెందరు..? అక్రమంగా ఉంటున్నవారెందరు అన్న భారీ కసరత్తులో భాగంగా జరిగిన ప్రక్రియ ఇది.. సిటిజన్స్ లిస్ట్ లో 3. 11 కోట్ల మంది పేర్లను చేర్చారు. 1951 తరువాత దేశంలో ప్రచురితమైన అతి పెద్ద రెండో (జనాభా) జాబితా ఇది.. జమ్మూ కాశ్మీర్కు స్వయం ప్రతిపత్తిని కల్పించడానికి ఉద్దేశించిన 370 అధికరణాన్ని […]

అస్సాం ఎన్నార్సీ... మోదీ సెకండ్ స్ట్రాటజీ
Follow us

|

Updated on: Aug 31, 2019 | 1:42 PM

అస్సాంలో 19 లక్షల మంది పేర్లను నేషనల్ సిటిజన్స్ లిస్ట్ (ఎన్ ఆర్ సీ ) లో తొలగించారు. లీగల్ గా ఈ రాష్ట్రంలో ఉంటున్నవారెందరు..? అక్రమంగా ఉంటున్నవారెందరు అన్న భారీ కసరత్తులో భాగంగా జరిగిన ప్రక్రియ ఇది.. సిటిజన్స్ లిస్ట్ లో 3. 11 కోట్ల మంది పేర్లను చేర్చారు. 1951 తరువాత దేశంలో ప్రచురితమైన అతి పెద్ద రెండో (జనాభా) జాబితా ఇది.. జమ్మూ కాశ్మీర్కు స్వయం ప్రతిపత్తిని కల్పించడానికి ఉద్దేశించిన 370 అధికరణాన్ని రద్దు చేసిన అనంతరం మోదీ ప్రభుత్వం చేబట్టిన అత్యంత ప్రధానమైన, రెండో వ్యూహమిది. లీగల్ చిక్కులు అన్నీ పరిష్కారమయ్యేవరకు ఫైనల్ జాబితాలో చేర్చని వారిని విదేశీయులుగా పరిగణించజాలమని ప్రభుత్వం తెలిపింది. ఈ జాబితాలో తమ పేరు లేని ఎవరైనా ఫారినర్స్ ట్రిబ్యునల్ కు అప్పీలు చేసుకోవచ్చునని, ఇందుకు కాల పరిమితిని 60 రోజుల నుంచి 120 రోజులకు పెంచామని అధికారులు స్పష్టం చేశారు. తమ పేర్లు లిస్టులో ఉన్నాయో., లేదో తెలుసుకునేందుకు, స్టేటస్ ఆరాకు ఎన్ ఆర్ సి వెబ్ సైట్ లో చూసుకోవచ్ఛునని అంటున్నారు. అయితే జాబితా ప్రచురితమయ్యాక సైట్ క్రాష్ అయింది. ప్రజలు ఈ స్టేటస్ ను ప్రభుత్వం ఏర్పాటు చేసిన సేవా కేంద్రాల నుంచి, లేదా డిప్యూటీ కమిషనర్ల కార్యాలయాలనుంచి తెలుసుకోవచ్ఛునంటున్నారు. తాజాగా జాబితా రిలీజ్ చేసిన నేపథ్యంలో.. అస్సాం, బంగ్లాదేశ్ సరిహద్దుల్లో భారీ ఎత్తున పోలీసు, పారా మిలిటరీ బలగాలను మోహరించారు. గత జులైలో ప్రచురితమైన ముసాయిదా లో సుమారు 41 లక్షల మంది పేర్లను తొలగించారు. తాము స్థానికులమేనని నిరూపించే ఆధారాలతో రావాలని వారిని కోరారు. ఇక వివాదాలను ఆలకించేందుకు కనీసం వెయ్యి ట్రిబ్యునల్స్ ను ఏర్పాటు చేస్తామని హోం శాఖ ప్రకటించింది. ఇప్పటికే 100 ట్రిబ్యునల్స్ ఏర్పాటయ్యాయి. వచ్ఛే నెలలో మరో 200 ట్రిబ్యునల్స్ ఏర్పాటు కానున్నాయి. ట్రిబ్యునల్ లో ఎవరి కేసు అయినా ఓడిపోతే.. వారు హైకోర్టును, ఆ తరువాత సుప్రీంకోర్టును ఆశ్రయించవచ్చు. లీగల్ మార్గాలన్నీ ‘మూసుకుపోయేంతవరకు’ ఎవరినీ నిర్బంధ శిబిరాల్లో ఉంచబోరు. పెద్ద సంఖ్యలో బెంగాలీ హిందువులను జాబితా నుంచి మినహాయించారని పలువురు బీజేపీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సీఎం సర్బానంద సోనోవాల్.. కేంద్ర హోం మంత్రి అమిత్ షా ను కలిసి.. విదేశీయుల తొలగింపునకు అనువుగా చట్టం తెచ్చే విషయాన్ని పరిశీలించాలని కోరారు. 1951 నాటి మొదటి జాబితాను అప్ డేట్ చేసి రెండో లిస్టును రూపొందించాలన్న సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు తాజాగా ప్రభుత్వం ఈ జాబితా విడుదల చేసింది.

Ex-Cricketerపై చిరుత దాడి..ప్రాణాలకు తెగించి కాపాడిన పెంపుడుకుక్క
Ex-Cricketerపై చిరుత దాడి..ప్రాణాలకు తెగించి కాపాడిన పెంపుడుకుక్క
ఉద్యోగం మానేసినందుకు పండగ చేసుకున్నాడు.. నచ్చని కంపెనీలో పనిచేసే
ఉద్యోగం మానేసినందుకు పండగ చేసుకున్నాడు.. నచ్చని కంపెనీలో పనిచేసే
పెళ్లి డ్రెస్ కు కొత్త రూపం ఇచ్చిన సమంత.. ఇకపై ఇలాగే..
పెళ్లి డ్రెస్ కు కొత్త రూపం ఇచ్చిన సమంత.. ఇకపై ఇలాగే..
శ్రీశైలంలో ఘనంగా శ్రీ భ్రమరాంబికాదేవికి కుంభోత్సవం
శ్రీశైలంలో ఘనంగా శ్రీ భ్రమరాంబికాదేవికి కుంభోత్సవం
హుండీలోని రూ 2 వేల నోట్ల మార్పిడికి ఆర్బీఐ గ్రీన్‌ సిగ్నల్
హుండీలోని రూ 2 వేల నోట్ల మార్పిడికి ఆర్బీఐ గ్రీన్‌ సిగ్నల్
మల్లె పువ్వుతో అందమే కాదు.. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయ్!
మల్లె పువ్వుతో అందమే కాదు.. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయ్!
ఫ్రేషర్స్ కి గుడ్ న్యూస్ చెప్పిన దిగ్గజ టెక్ కంపెనీ.. 6 వేల మంది
ఫ్రేషర్స్ కి గుడ్ న్యూస్ చెప్పిన దిగ్గజ టెక్ కంపెనీ.. 6 వేల మంది
ముసుగు చాటున అందాల ముద్దుగుమ్మ.. ముక్కుపుడకనే అసలు అట్రాక్షన్..
ముసుగు చాటున అందాల ముద్దుగుమ్మ.. ముక్కుపుడకనే అసలు అట్రాక్షన్..
జూబ్లీహిల్స్‌లో కోట్ల విలువైన వజ్రాభరణాలు చోరీ..
జూబ్లీహిల్స్‌లో కోట్ల విలువైన వజ్రాభరణాలు చోరీ..
డిగ్రీ పాస్‌ అయితే చాలు.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం.
డిగ్రీ పాస్‌ అయితే చాలు.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం.