జమ్ముకశ్మీర్‌లో ఎన్‌కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదులు హతం

జమ్ముకశ్మీర్‌ అనంత్ నాగ్ జిల్లాలో ఇవాళ ఉదయం ఉగ్రవాదులకు, భద్రతా బలగాలకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. జిల్లాలోని బాగేందర్ మొహల్లా వద్ద ఉగ్రవాదులు ఉన్నారన్న పక్కా సమాచారంతో.. భద్రతా బలగాలు ఆ ప్రాంతంలో గాలింపు చేపట్టారు. తనిఖీలు చేపడుతున్న జవాన్లపై ఉగ్రవాదులు ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డారు. దీంతో భద్రతా సిబ్బంది ఎదురు కాల్పులకు దిగడంతో.. ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. ఘటనాస్థలిలో భారీ ఎత్తున మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. […]

జమ్ముకశ్మీర్‌లో ఎన్‌కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదులు హతం
Follow us

| Edited By:

Updated on: Apr 25, 2019 | 11:36 AM

జమ్ముకశ్మీర్‌ అనంత్ నాగ్ జిల్లాలో ఇవాళ ఉదయం ఉగ్రవాదులకు, భద్రతా బలగాలకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. జిల్లాలోని బాగేందర్ మొహల్లా వద్ద ఉగ్రవాదులు ఉన్నారన్న పక్కా సమాచారంతో.. భద్రతా బలగాలు ఆ ప్రాంతంలో గాలింపు చేపట్టారు. తనిఖీలు చేపడుతున్న జవాన్లపై ఉగ్రవాదులు ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డారు. దీంతో భద్రతా సిబ్బంది ఎదురు కాల్పులకు దిగడంతో.. ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. ఘటనాస్థలిలో భారీ ఎత్తున మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. కాగా మిగిలిన ఉగ్రవాదుల కోసం గాలింపు కొనసాగుతోంది.