AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఛత్తీస్‌గఢ్‌లో ఇద్దరు మావోయిస్టులు అరెస్ట్

ఛత్తీస్‌గఢ్ : ఛత్తీస్‌గఢ్‌లోని ధంతరి జిల్లా సీతండీ పోలీస్‌స్టేషన్ పరిధిలో భద్రతా దళాలు ఇద్దరు మావోయిస్టులను అదుపులోకి తీసుకున్నారు. సీతండీ పరిధిలో భద్రతా దళాలు కూంబింగ్ నిర్వహిస్తున్న క్రమంలో ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా పరుగెత్తడాన్ని గమనించారు. వెంటనే జవాన్లు వారిని అదుపులోకి తీసుకుని విచారించారు. విచారణలో ఒకరిని సీతండి ఏరియా కమాండర్ అజిత్ మోడియం, మరోవ్యక్తిని ఏరియా కమిటీ సభ్యుడు రామ్సూ కుంజంగా గుర్తించారు. వీరిద్దరిపై ధంతరి జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్లలో 17 కేసులు ఉన్నాయని, […]

ఛత్తీస్‌గఢ్‌లో ఇద్దరు మావోయిస్టులు అరెస్ట్
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Apr 01, 2019 | 10:20 PM

Share

ఛత్తీస్‌గఢ్ : ఛత్తీస్‌గఢ్‌లోని ధంతరి జిల్లా సీతండీ పోలీస్‌స్టేషన్ పరిధిలో భద్రతా దళాలు ఇద్దరు మావోయిస్టులను అదుపులోకి తీసుకున్నారు. సీతండీ పరిధిలో భద్రతా దళాలు కూంబింగ్ నిర్వహిస్తున్న క్రమంలో ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా పరుగెత్తడాన్ని గమనించారు. వెంటనే జవాన్లు వారిని అదుపులోకి తీసుకుని విచారించారు. విచారణలో ఒకరిని సీతండి ఏరియా కమాండర్ అజిత్ మోడియం, మరోవ్యక్తిని ఏరియా కమిటీ సభ్యుడు రామ్సూ కుంజంగా గుర్తించారు. వీరిద్దరిపై ధంతరి జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్లలో 17 కేసులు ఉన్నాయని, అజిత్‌పై రూ.6 లక్షల రివార్డు కూడా ఉందని జిల్లా ఎస్పీ బాలాజీరావు తెలిపారు. వారి వద్ద నుంచి ఒక తుపాకీ, పేలుడు పదార్థాలు, నిత్యావసర సరుకులు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.