ఓటమిని అంగీకరించకపోతే, ట్రంప్ కి బైడెన్ వర్గం వార్నింగ్

అమెరికా ఎన్నికల్లో ట్రంప్ తన ఓటమిని అంగీకరించకపోతే వైట్ హౌస్ నుంచి ఎస్కార్టుతో ఆయనను పంపించివేయవలసి ఉంటుందని జో బైడెన్ ప్రచారవర్గం హెచ్చరించింది. తాము జులై 19 నే ఈ విషయాన్ని ప్రకటించామని, ఎన్నికల్లో ఎవరు విజేతలో అమెరికన్లు నిర్ణయిస్తారని బైడెన్ వర్గ ప్రచార సారధి ఎండ్రు బేట్స్ అన్నారు. వైట్ హౌస్ లోకి అక్రమంగా చొరబడినవారిని శ్వేతసౌధం నుంచి పంపివేయడానికి ఈ ప్రభుత్వానికి సామర్థ్యం ఉందన్నారు. కాగా ట్రంప్ గత జులైలో ఫాక్స్ న్యూస్ కి […]

ఓటమిని అంగీకరించకపోతే,  ట్రంప్ కి బైడెన్ వర్గం వార్నింగ్
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Nov 07, 2020 | 7:34 PM

అమెరికా ఎన్నికల్లో ట్రంప్ తన ఓటమిని అంగీకరించకపోతే వైట్ హౌస్ నుంచి ఎస్కార్టుతో ఆయనను పంపించివేయవలసి ఉంటుందని జో బైడెన్ ప్రచారవర్గం హెచ్చరించింది. తాము జులై 19 నే ఈ విషయాన్ని ప్రకటించామని, ఎన్నికల్లో ఎవరు విజేతలో అమెరికన్లు నిర్ణయిస్తారని బైడెన్ వర్గ ప్రచార సారధి ఎండ్రు బేట్స్ అన్నారు. వైట్ హౌస్ లోకి అక్రమంగా చొరబడినవారిని శ్వేతసౌధం నుంచి పంపివేయడానికి ఈ ప్రభుత్వానికి సామర్థ్యం ఉందన్నారు. కాగా ట్రంప్ గత జులైలో ఫాక్స్ న్యూస్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ..ఎన్నికల ఫలితాలను అంగీకరించేందుకు, ఒకవేళ తను ఓడిపోతే శాంతియుతంగా అధికారాన్ని అప్పగించేందుకు నిరాకరిస్తానని పేర్కొన్నారు. దీనిపైనే ఎండ్రు  తాజాగా స్పందించారు.