అల తీసిన ప్రాణం..గోవాలో విషాదం
గోవా బీచ్ లో ఓ తెలుగమ్మాయి ప్రమాదవశాత్తు మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఏపీలోని కృష్ణా జిల్లా జగ్గయ్యపేటకు చెందిన ఊటుకూరు రమ్యకృష్ణ వృత్తిరీత్యా ఓ వైద్యురాలు. 2008 వరకు జగ్గయ్యపేట హెల్త్ సెంటర్ లో డాక్టర్గా పనిచేసిన రమ్యకృష్ణ ఆ తర్వాత గోవాలో ప్రభుత్వ అనుబంధ వైద్యసంస్థలో ఉద్యోగంలో చేరారు. అయితే, మంగళవారం సాయంత్రం గోవా బీచ్ లో సెల్ఫీ తీసుకునే క్రమంలో ప్రమాదం చోటుచేసుకుంది. సముద్రం కెరటాలు ఒక్కసారిగా ఆమెను లాక్కెళ్లాయి. […]
గోవా బీచ్ లో ఓ తెలుగమ్మాయి ప్రమాదవశాత్తు మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఏపీలోని కృష్ణా జిల్లా జగ్గయ్యపేటకు చెందిన ఊటుకూరు రమ్యకృష్ణ వృత్తిరీత్యా ఓ వైద్యురాలు. 2008 వరకు జగ్గయ్యపేట హెల్త్ సెంటర్ లో డాక్టర్గా పనిచేసిన రమ్యకృష్ణ ఆ తర్వాత గోవాలో ప్రభుత్వ అనుబంధ వైద్యసంస్థలో ఉద్యోగంలో చేరారు.
అయితే, మంగళవారం సాయంత్రం గోవా బీచ్ లో సెల్ఫీ తీసుకునే క్రమంలో ప్రమాదం చోటుచేసుకుంది. సముద్రం కెరటాలు ఒక్కసారిగా ఆమెను లాక్కెళ్లాయి. దీంతో అలల్లో కొట్టుకునిపోయి ప్రాణాలు విడిచింది.