AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తెలంగాణలో కాస్త తగ్గుమొఖం పట్టిన కరోనా కేసులు

దేశవ్యాప్తంగా కరోనా కల్లోలం కంటిన్యూ అవుతూనే ఉంది. ఇటు రాష్ట్ర వ్యాప్తంగా కొత్త కరోనా కేసులు వెలుగుచూస్తున్నాయి. కాకపోతే గత రోజులతో పోల్చి కాస్త తక్కువ కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో తెలంగాణలో కొత్తగా 1,302 కొవిడ్‌ పాజిటివ్‌ కేసులు నిర్ధారణ.

తెలంగాణలో కాస్త తగ్గుమొఖం పట్టిన కరోనా కేసులు
Balaraju Goud
|

Updated on: Sep 21, 2020 | 2:36 PM

Share

దేశవ్యాప్తంగా కరోనా కల్లోలం కంటిన్యూ అవుతూనే ఉంది. ఇటు రాష్ట్ర వ్యాప్తంగా కొత్త కరోనా కేసులు వెలుగుచూస్తున్నాయి. కాకపోతే గత రోజులతో పోల్చి కాస్త తక్కువ కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో తెలంగాణలో కొత్తగా 1,302 కొవిడ్‌ పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయ్యాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ వెల్లడించింది. కొత్తగా నమోదైన కేసులతో కలిపి మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 1,72,608కి చేరుకుంది. ఒక్కరోజే కొత్తగా 2,230 మంది కరోనా వైరస్‌ నుంచి కోలుకోగా, ఇప్పటి వరకు 1,41,930 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్చ్ అయ్యారు. కాగా, గడిచిన 24 గంటల్లో మరో 9 మంది కరోనాతో మృతి చెందగా, ఇప్పటివరకు మొత్తం 1,042 మంది మృత్యువాతపడ్డారు. ప్రస్తుతం రాష్ట్రంలో 29,636 యాక్టివ్‌ కేసులున్నాయని, మరో 22,990 మంది హోం ఐసోలేషన్‌లో ఉన్నట్లు వైద్య, ఆరోగ్యశాఖ పేర్కొంది. కాగా, రాష్ట్రంలో 0.60శాతం మరణాలు రేటు ఉండగా, రికవరీ రేటు 82.22శాతంగా ఉందని తెలిపింది. నిన్న ఆదివారం ఒక్కరోజే 31,095 శాంపిల్స్‌ పరీక్షించగా, 1,205 నమూనాల ఫలితాలు రావాల్సి ఉందని, ఇప్పటికీ మొత్తం 25,19,315 టెస్టులు చేసినట్లు వివరించింది. తాజాగా నమోదైన కేసుల్లో అత్యధికంగా హైదరాబాద్‌ జీహెచ్‌ఎంసీలో 266 నిర్ధారణ అయ్యాయి. తర్వాత కరీంనగర్‌లో 102, రంగారెడ్డి 98, సిద్దిపేటలో 92 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.