AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

న్యూయార్క్‌లో బంగ్లాదేశ్ సీఈవో దారుణహత్య!

అమెరికాలో బంగ్లాదేశ్‌కు చెందిన రెండు టెక్ కంపెనీల సీఈవో ఫహీమ్ సలేహ్ దారుణహత్యకు గురయ్యారు. ఆయన మృతదేహాన్ని న్యూయార్క్ లోని లగ్జరీ అపార్ట్‌మెంట్ నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అపార్ట్‌మెంట్ లో

న్యూయార్క్‌లో బంగ్లాదేశ్ సీఈవో దారుణహత్య!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jul 16, 2020 | 4:25 PM

Share

అమెరికాలో బంగ్లాదేశ్‌కు చెందిన రెండు టెక్ కంపెనీల సీఈవో ఫహీమ్ సలేహ్ దారుణహత్యకు గురయ్యారు. ఆయన మృతదేహాన్ని న్యూయార్క్ లోని లగ్జరీ అపార్ట్‌మెంట్ నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అపార్ట్‌మెంట్ లో అతని శరీరం భాగాలు చెల్లాచెదురుగా పడివున్నాయి. ఘటనా స్థలం నుంచి విద్యుత్ రంపంను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వ్యాపార శత్రుత్వంలో భాగంగానే సలేహ్ దారుణహత్య జరిగివుంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు.

వివరాల్లోకెళితే.. ఫహీమ్ సోదరి ఫహీమ్ సలేహ్ అపార్ట్‌మెంట్ కు చేరుకున్న సమయంలో అక్కడ ఎలక్ట్రిక్ రంపాలతో ఒక వ్యక్తి పనిచేస్తూ ఉన్నాడు. ఆమెను చూడగానే నిందితుడు రెండవ గేటు నుంచి తప్పించుకుని పారిపోయాడు. మొండెం, తల, కాళ్ళు, చేతులు నరికి వేరు చేయబడ్డాయి. పాలిథీన్ సంచుల్లో ముక్కలను నింపేందుకు నిందితుడు సిద్ధమయ్యే సమయంలో ఫహీమ్ సోదరి వచ్చింది. ఫహీమ్ ఫోన్ తీయకపోవడంతో సోదరుడిని కలవడానికి నేరుగా అపార్ట్‌మెంట్ కు వచ్చానని సలేహ్ సోదరి పోలీసులకు తెలిపింది.

యూఎస్ లో అతను హత్య చేయబడిన అపార్ట్‌మెంట్ విలువ సుమారు 2.2 మిలియన్లు డాలర్లు. 2018 లో ఫహీమ్ నైజీరియాకు చెందిన మోటారు సైకిల్ రైడ్ షేరింగ్ సంస్థ గోక్డాను ప్రారంభించాడు. బంగ్లాదేశ్‌లో ‘పాథో’ పేరుతో మరో కంపెనీ నడుపుతున్నాడు.