AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తమిళనాడు సీఎం పళనిస్వామి కీలక ప్రకటన.. కాలేజీ విద్యార్థులకు ఉచితంగా 2జీబీ డేటా కార్డులు

విద్యార్థులకు ఉచితంగా డేటా ఇస్తున్నట్లు ప్రకటించారు తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి పళనిస్వామి.

తమిళనాడు సీఎం పళనిస్వామి కీలక ప్రకటన.. కాలేజీ విద్యార్థులకు ఉచితంగా 2జీబీ డేటా కార్డులు
Balaraju Goud
|

Updated on: Jan 11, 2021 | 1:57 AM

Share

2GB data for college students: తమిళనాట అసెంబ్లీ ఎన్నికల సమయం సమీపిస్తున్నవేళ రాజకీయ పార్టీలు హామీల వర్షం కురిపిస్తున్నారు. విద్యార్థులకు ఉచితంగా డేటా ఇస్తున్నట్లు ప్రకటించారు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పళనిస్వామి. కరోనా నేపథ్యంలో ఆన్‌లైన్‌ క్లాసులను సద్వినియోగం చేసుకునేందుకు విద్యార్థులకు రోజుకు 2 జీబీ డేటాను ఉచితంగా అందించాలని నిర్ణయించినట్లు తమిళనాడు ప్రభుత్వం ప్రకటించింది. కాలేజీ విద్యార్థులందరికీ ఉచిత డేటా కార్డులు ఇవ్వనున్నట్టు ముఖ్యమంత్రి పళనిస్వామి ఆదివారం ప్రకటించారు.

ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి దెబ్బకు విద్యాసంస్థలు మూతపడ్డాయి. ఈ నేపథ్యంలో పాఠశాలలు, కాలేజీలు ఆన్‌లైన్‌ క్లాసులు నిర్వహిస్తున్నాయి. విద్యార్థులంతా ఈ క్లాసులను సద్వినియోగం చేసుకునేందుకు జనవరి నుంచి ఏప్రిల్‌ వరకు రోజుకు 2 జీబీ డేటా ఉచితంగా అందించాలని ప్రభుత్వం నిర్ణయించిందని సీఎం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ప్రభుత్వ కళాశాలలతో పాటు, ఎయిడెడ్‌ కాలేజీల్లో చదువుతున్న విద్యార్థులకు డేటా కార్డులు పంపిణీ చేయనున్నట్టు వివరించారు. తమిళనాడు ప్రభుత్వం నిర్ణయంతో ఆ రాష్ట్రంలో మొత్తంగా 9.69 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి చేకూరనుంది.