గాంధీ ఆసుపత్రికి కరోనా అనుమానితుల క్యూ..!

కరోనా అనుమానితులు గాంధీ ఆసుపత్రికి క్యూ కడుతున్నారు. సగటున రోజుకు అయిదు నుంచి పది మంది అనుమానితులు ఆసుపత్రిలో చేరుతున్నారు. ఇవాళ కూడా ఏడుగురు కరోనా వైరస్‌ అనుమానితులు అడ్మిట్‌ అయ్యారు.

గాంధీ ఆసుపత్రికి కరోనా అనుమానితుల క్యూ..!
Follow us

| Edited By:

Updated on: Mar 06, 2020 | 5:37 PM

కరోనా అనుమానితులు గాంధీ ఆసుపత్రికి క్యూ కడుతున్నారు. సగటున రోజుకు అయిదు నుంచి పది మంది అనుమానితులు ఆసుపత్రిలో చేరుతున్నారు. ఇవాళ కూడా ఏడుగురు కరోనా వైరస్‌ అనుమానితులు అడ్మిట్‌ అయ్యారు. దీంతో గాంధీ ఆసుపత్రిలోని ఐసోలేషన్‌ వార్డులో అనుమానితుల సంఖ్య 37కు పెరిగింది. నగరంలోని గాంధీ ఆసుపత్రి.. ఫీవర్‌ ఆసుపత్రి ఐసోలేషన్‌ వార్డుల్లో ఉన్నవారి సంఖ్య 618కి చేరింది.

ఇక గాంధీ ఆసుపత్రిలో 215 మందికి టెస్టులు జరపగా… వారిలో 169 మందికి నెగటివ్‌ రిపోర్టు వచ్చిందని వైద్యా ఆరోగ్యశాఖాధికారులు తెలిపారు. మరోవైపు కరోనాపై తెలంగాణ ప్రభుత్వం యుద్ధం ప్రకటించిందన్నారు రాష్ట్ర ఆరోగ్యశాఖ డైరెక్టర్‌ శ్రీనివాస్‌రావు. ఇప్పటి వరకు రాష్ట్రంలో ఒకే కేసు నమోదైందన్నారు. వైరస్‌ నివారణ కోసం ప్రజలు కూడా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందన్నారు.