AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గిరిజనబాలికపై ఆరునెలలుగా వివాహితుడి అత్యాచారం

మహిళలు, బాలికలపై మృగాళ్లు తమ పైశాచికత్వాన్ని ఆపడం లేదు. నల్గొండ జిల్లా నిడమనూరు మండలం శాఖాపురం గ్రామంలో పొట్టకూటి కోసం వలస వచ్చి మాజీ ఎంపీపీ దగ్గర పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్న గిరిజన బాలికపై అదే గ్రామానికి చెందిన రమేష్ అనే వివాహితుడు గత ఆరు నెలలగా అత్యాచారం చేస్తున్నాడు. విషయం ఆలస్యంగా వెలుగులోకి రావడంతో నిన్న నిడమనూరు పోలీస్ స్టేషన్లలో బాలిక తల్లి ఫిర్యాదు చేసింది. గత ఆరు నెలలగా అమ్మాయిని బెదిరించి, అత్యాచారానికి […]

గిరిజనబాలికపై ఆరునెలలుగా వివాహితుడి అత్యాచారం
Venkata Narayana
|

Updated on: Nov 04, 2020 | 12:38 PM

Share

మహిళలు, బాలికలపై మృగాళ్లు తమ పైశాచికత్వాన్ని ఆపడం లేదు. నల్గొండ జిల్లా నిడమనూరు మండలం శాఖాపురం గ్రామంలో పొట్టకూటి కోసం వలస వచ్చి మాజీ ఎంపీపీ దగ్గర పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్న గిరిజన బాలికపై అదే గ్రామానికి చెందిన రమేష్ అనే వివాహితుడు గత ఆరు నెలలగా అత్యాచారం చేస్తున్నాడు. విషయం ఆలస్యంగా వెలుగులోకి రావడంతో నిన్న నిడమనూరు పోలీస్ స్టేషన్లలో బాలిక తల్లి ఫిర్యాదు చేసింది. గత ఆరు నెలలగా అమ్మాయిని బెదిరించి, అత్యాచారానికి పాల్పడుతున్న సదరు కిరాతకుడ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. తిరుమలగిరి మండలం ధన్ సింగ్ తండాకు చెందిన లక్ష్మీ, చందర్ దంపతులకు ఒక కుమార్తె, ఇద్దరు కుమారులు. వీరంతా కలిసి బ్రతుకుతెరువు రిత్యా శాఖాపురంలో నివాసం ఉంటున్నారు. తల్లిదండ్రులు కూలీ పనికి వెళ్లగా బాలిక ఒక్కతే ఇంటి దగ్గర ఉండడం గమనించిన ట్రాక్టర్ డ్రైవర్ గా పని చేస్తున్న రమేష్ 6 నెలలుగా బాలికపై అత్యాచారం చేస్తూ గర్భవతిని చేశాడు. రమేష్ కూడా మాజీ ఎంపీపీ దగ్గరే డ్రైవర్. కాగా, బాలికకు కడుపు నొప్పి రావడంతో బాలిక తల్లి ఆర్ఎంపీ వైద్యుడికి చూపించింది. బాధిత బాలిక గర్భం దాల్చిన విషయం చెప్పడంతో తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో విషయం బయటకు పొక్కింది.