AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సోమవారం నుంచి పార్లమెంట్ సమావేశాలు.. విపక్షంగా మారిన మిత్రపక్షం

పార్లమెంటు శీతాకాల సమావేశాలు ఈనెల 18న ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో గత కొన్నేళ్లుగా మిత్రులుగా ఉన్న పార్టీలు.. ఈ సమావేశంలో శత్రువులుగా మారనున్నారు. ఈ సారి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత వర్షాకాల సమావేశాల్లో మిత్రపక్షంగా ఉన్న శివసేన.. శీతాకాల సమావేశంలో విపక్షంలో కూర్చోనుంది. దీనికి అసలు కారణం.. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలు. గత నెలలో జరిగిన ఎన్నికల్లో మహారాష్ట్రలో బీజేపీ, శివసేన పార్టీలు కలిసి పోటీ చేశాయి. అయితే ఫలితాలు వెలువడిన తర్వాత ఇరు […]

సోమవారం నుంచి పార్లమెంట్ సమావేశాలు.. విపక్షంగా మారిన మిత్రపక్షం
TV9 Telugu Digital Desk
|

Updated on: Nov 17, 2019 | 6:25 AM

Share

పార్లమెంటు శీతాకాల సమావేశాలు ఈనెల 18న ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో గత కొన్నేళ్లుగా మిత్రులుగా ఉన్న పార్టీలు.. ఈ సమావేశంలో శత్రువులుగా మారనున్నారు. ఈ సారి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత వర్షాకాల సమావేశాల్లో మిత్రపక్షంగా ఉన్న శివసేన.. శీతాకాల సమావేశంలో విపక్షంలో కూర్చోనుంది. దీనికి అసలు కారణం.. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలు. గత నెలలో జరిగిన ఎన్నికల్లో మహారాష్ట్రలో బీజేపీ, శివసేన పార్టీలు కలిసి పోటీ చేశాయి. అయితే ఫలితాలు వెలువడిన తర్వాత ఇరు పార్టీల మధ్య విభేదాలు చోటుచేసుకున్నాయి. ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీ, శివసేనకు కావాల్సిన బలం ఉన్నా.. సీఎం సీటు విషయంలో విభేదాలు వచ్చాయి. దీంతో శివసేన పార్టీ.. ఎన్సీపీ, కాంగ్రెస్‌తో చేతులు కలిపేందుకు సిద్దమైంది. శివసేనకు సీఎం పదవి దక్కాలన్న మొండిపట్టుదలతో ఈ నిర్ణయం తీసుకుంది. అయితే కేంద్ర మంత్రిగా ఉన్న శివసేన నేత.. రాజీనామా కూడా చేయడం సంచలనంగా మారింది. అంతేకాదు.. ఇక బీజేపీతో దోస్తీ కట్ అయినట్లేనంటూ సంకేతాలు కూడా పంపింది.

ఇక పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో ఎన్డీయే మిత్రపక్షాలు ఆదివారం భేటీ కానున్నాయి. పార్లమెంట్‌లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఈ సమావేశంలో చర్చించన్నారు. ఈ సమావేశానికి ప్రధాని మోదీతో పాటు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా కూడా హాజరుకానున్నారు. అయితే ఈ సమావేశానికి శివసేన హాజరుకాబోమని తెలిపినట్లు సమాచారం.

ఈ నేపథ్యంలో సోమవారం నుంచి జరగబోయే పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో శివసేన విపక్ష బెంచీల్లో కూర్చోనుంది. అంతేకాదు.. రాజ్యసభలో శివసేన ఎంపీలు కూర్చునే సీట్లలో మార్పులు కూడా చోటుచేసుకోనున్నాయి. శివసేన రాజ్యసభ ఎంపీలు సంజయ్ రౌత్, అనిల్ దేశాయ్‌‌లు విపక్ష సీట్లలో కూర్చుంటారని, ఈ మేరకు సీట్ల ఏర్పాట్లలో మార్పులు చోటుచేసుకోనున్నాయని చెబుతున్నారు. ఎగువసభలో శివసేనకు ముగ్గురు ఎంపీలు ఉన్నారు. అంతేకాదు.. పార్లమెంట్‌లో యూపీఏతో చేతులు కలిపి ఎన్డీఏపై ఫైర్ అయ్యే అవకాశం ఉంది.

Follow Us
కింగ్ ఈజ్ బ్యాక్.. ఇంగ్లాండ్ వన్డే సిరీస్‌తో మైదానంలోకి కోహ్లీ
కింగ్ ఈజ్ బ్యాక్.. ఇంగ్లాండ్ వన్డే సిరీస్‌తో మైదానంలోకి కోహ్లీ
ఆ ఇద్దరితో జరిగిన సంఘటన జీవితంలో మర్చిపోలేను.. వేణు మాధవ్
ఆ ఇద్దరితో జరిగిన సంఘటన జీవితంలో మర్చిపోలేను.. వేణు మాధవ్
కొత్త రేషన్ కార్డులకు బ్రేక్.. 30 వేల దరఖాస్తులు పెండింగ్
కొత్త రేషన్ కార్డులకు బ్రేక్.. 30 వేల దరఖాస్తులు పెండింగ్
మరణాన్ని ముద్దాడే మగ తేనెటీగ.. ఈ ప్రకృతి కథ తెలిస్తే అవాక్కే..
మరణాన్ని ముద్దాడే మగ తేనెటీగ.. ఈ ప్రకృతి కథ తెలిస్తే అవాక్కే..
మృత్యువుతో 7 రోజుల పోరాటం.. శిథిలాల నుంచి సజీవంగా..!
మృత్యువుతో 7 రోజుల పోరాటం.. శిథిలాల నుంచి సజీవంగా..!
ఈ పాతకాలం కారం పొడి తింటే చూపు ఒక్కసారిగా పెరిగిపోవడం పక్కా!
ఈ పాతకాలం కారం పొడి తింటే చూపు ఒక్కసారిగా పెరిగిపోవడం పక్కా!
యూట్యూబ్‏ను షేక్ చేస్తున్న ఫోక్ సాంగ్.. రెండు వారాల్లోనే..
యూట్యూబ్‏ను షేక్ చేస్తున్న ఫోక్ సాంగ్.. రెండు వారాల్లోనే..
ఐసీసీ ర్యాంకింగ్స్‌లో నం.1 సింహాసనాన్ని అధిరోహించిన నలుగురు వీరే
ఐసీసీ ర్యాంకింగ్స్‌లో నం.1 సింహాసనాన్ని అధిరోహించిన నలుగురు వీరే
భార్య, భర్తల మధ్య రోజూ గొడవలా? బెడ్‌రూమ్‌లో ఈ మొక్కను ఉంచండి
భార్య, భర్తల మధ్య రోజూ గొడవలా? బెడ్‌రూమ్‌లో ఈ మొక్కను ఉంచండి
హుస్సేన్ సాగర్ బుద్ధ విగ్రహం ఏర్పాటు వెనుక మీకు తెలియని స్టోరీ..
హుస్సేన్ సాగర్ బుద్ధ విగ్రహం ఏర్పాటు వెనుక మీకు తెలియని స్టోరీ..