AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సోమవారం నుంచి పార్లమెంట్ సమావేశాలు.. విపక్షంగా మారిన మిత్రపక్షం

పార్లమెంటు శీతాకాల సమావేశాలు ఈనెల 18న ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో గత కొన్నేళ్లుగా మిత్రులుగా ఉన్న పార్టీలు.. ఈ సమావేశంలో శత్రువులుగా మారనున్నారు. ఈ సారి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత వర్షాకాల సమావేశాల్లో మిత్రపక్షంగా ఉన్న శివసేన.. శీతాకాల సమావేశంలో విపక్షంలో కూర్చోనుంది. దీనికి అసలు కారణం.. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలు. గత నెలలో జరిగిన ఎన్నికల్లో మహారాష్ట్రలో బీజేపీ, శివసేన పార్టీలు కలిసి పోటీ చేశాయి. అయితే ఫలితాలు వెలువడిన తర్వాత ఇరు […]

సోమవారం నుంచి పార్లమెంట్ సమావేశాలు.. విపక్షంగా మారిన మిత్రపక్షం
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Nov 17, 2019 | 6:25 AM

Share

పార్లమెంటు శీతాకాల సమావేశాలు ఈనెల 18న ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో గత కొన్నేళ్లుగా మిత్రులుగా ఉన్న పార్టీలు.. ఈ సమావేశంలో శత్రువులుగా మారనున్నారు. ఈ సారి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత వర్షాకాల సమావేశాల్లో మిత్రపక్షంగా ఉన్న శివసేన.. శీతాకాల సమావేశంలో విపక్షంలో కూర్చోనుంది. దీనికి అసలు కారణం.. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలు. గత నెలలో జరిగిన ఎన్నికల్లో మహారాష్ట్రలో బీజేపీ, శివసేన పార్టీలు కలిసి పోటీ చేశాయి. అయితే ఫలితాలు వెలువడిన తర్వాత ఇరు పార్టీల మధ్య విభేదాలు చోటుచేసుకున్నాయి. ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీ, శివసేనకు కావాల్సిన బలం ఉన్నా.. సీఎం సీటు విషయంలో విభేదాలు వచ్చాయి. దీంతో శివసేన పార్టీ.. ఎన్సీపీ, కాంగ్రెస్‌తో చేతులు కలిపేందుకు సిద్దమైంది. శివసేనకు సీఎం పదవి దక్కాలన్న మొండిపట్టుదలతో ఈ నిర్ణయం తీసుకుంది. అయితే కేంద్ర మంత్రిగా ఉన్న శివసేన నేత.. రాజీనామా కూడా చేయడం సంచలనంగా మారింది. అంతేకాదు.. ఇక బీజేపీతో దోస్తీ కట్ అయినట్లేనంటూ సంకేతాలు కూడా పంపింది.

ఇక పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో ఎన్డీయే మిత్రపక్షాలు ఆదివారం భేటీ కానున్నాయి. పార్లమెంట్‌లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఈ సమావేశంలో చర్చించన్నారు. ఈ సమావేశానికి ప్రధాని మోదీతో పాటు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా కూడా హాజరుకానున్నారు. అయితే ఈ సమావేశానికి శివసేన హాజరుకాబోమని తెలిపినట్లు సమాచారం.

ఈ నేపథ్యంలో సోమవారం నుంచి జరగబోయే పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో శివసేన విపక్ష బెంచీల్లో కూర్చోనుంది. అంతేకాదు.. రాజ్యసభలో శివసేన ఎంపీలు కూర్చునే సీట్లలో మార్పులు కూడా చోటుచేసుకోనున్నాయి. శివసేన రాజ్యసభ ఎంపీలు సంజయ్ రౌత్, అనిల్ దేశాయ్‌‌లు విపక్ష సీట్లలో కూర్చుంటారని, ఈ మేరకు సీట్ల ఏర్పాట్లలో మార్పులు చోటుచేసుకోనున్నాయని చెబుతున్నారు. ఎగువసభలో శివసేనకు ముగ్గురు ఎంపీలు ఉన్నారు. అంతేకాదు.. పార్లమెంట్‌లో యూపీఏతో చేతులు కలిపి ఎన్డీఏపై ఫైర్ అయ్యే అవకాశం ఉంది.

Follow Us
IPL 2027: ధోనీతో పాటు మరో ఇద్దరు ఆటగాళ్లకు చెన్నై గుడ్ బై..?
IPL 2027: ధోనీతో పాటు మరో ఇద్దరు ఆటగాళ్లకు చెన్నై గుడ్ బై..?
ముంచుకొస్తున్న నైరుతి రుతుపవనాలు.. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు..
ముంచుకొస్తున్న నైరుతి రుతుపవనాలు.. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు..
ఒంటికి చలువ చేసే అదిరిపోయే ఈవెనింగ్ స్నాక్స్.. తోటకూర పకోడీ..
ఒంటికి చలువ చేసే అదిరిపోయే ఈవెనింగ్ స్నాక్స్.. తోటకూర పకోడీ..
మీకో సవాల్.. ఈ చిత్రంలో ఉన్న నెంబర్‌ను కనిపెడితే.. మీరే తోపులు!
మీకో సవాల్.. ఈ చిత్రంలో ఉన్న నెంబర్‌ను కనిపెడితే.. మీరే తోపులు!
బట్టల మురికి వదలట్లేదా?.. వాషింగ్ మెషీన్‌లో ఇదొక్కటి కలపండి!
బట్టల మురికి వదలట్లేదా?.. వాషింగ్ మెషీన్‌లో ఇదొక్కటి కలపండి!
మీ కెరీర్‌లో గ్రోత్ లేదా?.. మీరు చేసే ఈ చిన్న తప్పే కారణం
మీ కెరీర్‌లో గ్రోత్ లేదా?.. మీరు చేసే ఈ చిన్న తప్పే కారణం
పూజ చేస్తూ మనసు ఇతర విషయాలపైకి వెళ్తే అది పాపమా? ప్రేమానంద్ జీ...
పూజ చేస్తూ మనసు ఇతర విషయాలపైకి వెళ్తే అది పాపమా? ప్రేమానంద్ జీ...
ఒక్క మ్యాచ్ ఆడకుండా ధోనీ ఎంత జీతం తీసుకున్నాడో తెలుసా..?
ఒక్క మ్యాచ్ ఆడకుండా ధోనీ ఎంత జీతం తీసుకున్నాడో తెలుసా..?
కుళాయి నీరు కారుతున్నాయా? మీ ఇంట్లో డబ్బు ఖాళీ అవ్వడం పక్కా
కుళాయి నీరు కారుతున్నాయా? మీ ఇంట్లో డబ్బు ఖాళీ అవ్వడం పక్కా
బ్యాంకులు వరుసగా ఆరు రోజులు బంద్
బ్యాంకులు వరుసగా ఆరు రోజులు బంద్