AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సోమవారం నుంచి పార్లమెంట్ సమావేశాలు.. విపక్షంగా మారిన మిత్రపక్షం

పార్లమెంటు శీతాకాల సమావేశాలు ఈనెల 18న ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో గత కొన్నేళ్లుగా మిత్రులుగా ఉన్న పార్టీలు.. ఈ సమావేశంలో శత్రువులుగా మారనున్నారు. ఈ సారి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత వర్షాకాల సమావేశాల్లో మిత్రపక్షంగా ఉన్న శివసేన.. శీతాకాల సమావేశంలో విపక్షంలో కూర్చోనుంది. దీనికి అసలు కారణం.. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలు. గత నెలలో జరిగిన ఎన్నికల్లో మహారాష్ట్రలో బీజేపీ, శివసేన పార్టీలు కలిసి పోటీ చేశాయి. అయితే ఫలితాలు వెలువడిన తర్వాత ఇరు […]

సోమవారం నుంచి పార్లమెంట్ సమావేశాలు.. విపక్షంగా మారిన మిత్రపక్షం
TV9 Telugu Digital Desk
|

Updated on: Nov 17, 2019 | 6:25 AM

Share

పార్లమెంటు శీతాకాల సమావేశాలు ఈనెల 18న ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో గత కొన్నేళ్లుగా మిత్రులుగా ఉన్న పార్టీలు.. ఈ సమావేశంలో శత్రువులుగా మారనున్నారు. ఈ సారి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత వర్షాకాల సమావేశాల్లో మిత్రపక్షంగా ఉన్న శివసేన.. శీతాకాల సమావేశంలో విపక్షంలో కూర్చోనుంది. దీనికి అసలు కారణం.. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలు. గత నెలలో జరిగిన ఎన్నికల్లో మహారాష్ట్రలో బీజేపీ, శివసేన పార్టీలు కలిసి పోటీ చేశాయి. అయితే ఫలితాలు వెలువడిన తర్వాత ఇరు పార్టీల మధ్య విభేదాలు చోటుచేసుకున్నాయి. ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీ, శివసేనకు కావాల్సిన బలం ఉన్నా.. సీఎం సీటు విషయంలో విభేదాలు వచ్చాయి. దీంతో శివసేన పార్టీ.. ఎన్సీపీ, కాంగ్రెస్‌తో చేతులు కలిపేందుకు సిద్దమైంది. శివసేనకు సీఎం పదవి దక్కాలన్న మొండిపట్టుదలతో ఈ నిర్ణయం తీసుకుంది. అయితే కేంద్ర మంత్రిగా ఉన్న శివసేన నేత.. రాజీనామా కూడా చేయడం సంచలనంగా మారింది. అంతేకాదు.. ఇక బీజేపీతో దోస్తీ కట్ అయినట్లేనంటూ సంకేతాలు కూడా పంపింది.

ఇక పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో ఎన్డీయే మిత్రపక్షాలు ఆదివారం భేటీ కానున్నాయి. పార్లమెంట్‌లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఈ సమావేశంలో చర్చించన్నారు. ఈ సమావేశానికి ప్రధాని మోదీతో పాటు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా కూడా హాజరుకానున్నారు. అయితే ఈ సమావేశానికి శివసేన హాజరుకాబోమని తెలిపినట్లు సమాచారం.

ఈ నేపథ్యంలో సోమవారం నుంచి జరగబోయే పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో శివసేన విపక్ష బెంచీల్లో కూర్చోనుంది. అంతేకాదు.. రాజ్యసభలో శివసేన ఎంపీలు కూర్చునే సీట్లలో మార్పులు కూడా చోటుచేసుకోనున్నాయి. శివసేన రాజ్యసభ ఎంపీలు సంజయ్ రౌత్, అనిల్ దేశాయ్‌‌లు విపక్ష సీట్లలో కూర్చుంటారని, ఈ మేరకు సీట్ల ఏర్పాట్లలో మార్పులు చోటుచేసుకోనున్నాయని చెబుతున్నారు. ఎగువసభలో శివసేనకు ముగ్గురు ఎంపీలు ఉన్నారు. అంతేకాదు.. పార్లమెంట్‌లో యూపీఏతో చేతులు కలిపి ఎన్డీఏపై ఫైర్ అయ్యే అవకాశం ఉంది.

Follow Us
ఏపీలోని ఈ ప్రాంతాల్లో వర్షాలు.. వచ్చే 3 రోజుల వెదర్ రిపోర్ట్
ఏపీలోని ఈ ప్రాంతాల్లో వర్షాలు.. వచ్చే 3 రోజుల వెదర్ రిపోర్ట్
క్రెడిట్ కార్డు బిల్లు ఒక్కరోజే ఆలస్యమైతే సిబిల్ స్కోర్ పోతుందా..
క్రెడిట్ కార్డు బిల్లు ఒక్కరోజే ఆలస్యమైతే సిబిల్ స్కోర్ పోతుందా..
బిగ్ బాస్ సీజన్ 10 అగ్నిపరీక్ష.. ఆడిషన్స్ వివరాలు ఇవే..
బిగ్ బాస్ సీజన్ 10 అగ్నిపరీక్ష.. ఆడిషన్స్ వివరాలు ఇవే..
ఇక నీట్ రీ-ఎగ్జాం మరింత ఈజీ.. NTA ప్రకటించిన కొత్త సౌకర్యాలు ఇవే!
ఇక నీట్ రీ-ఎగ్జాం మరింత ఈజీ.. NTA ప్రకటించిన కొత్త సౌకర్యాలు ఇవే!
నడిరోడ్డుపై జిమ్‌ ఓనర్‌ను కాల్చి చంపిన దుండగులు.. ఇదిగో వీడియో
నడిరోడ్డుపై జిమ్‌ ఓనర్‌ను కాల్చి చంపిన దుండగులు.. ఇదిగో వీడియో
చిటికెలో రక్తాన్ని పెంచే పవర్ఫుల్ రెసిపీ
చిటికెలో రక్తాన్ని పెంచే పవర్ఫుల్ రెసిపీ
రూపాయి సబ్‌స్క్రిప్షన్ లేకుండా ఫ్రీగా ఫిఫా వరల్డ్ కప్ చూసే ట్రిక్
రూపాయి సబ్‌స్క్రిప్షన్ లేకుండా ఫ్రీగా ఫిఫా వరల్డ్ కప్ చూసే ట్రిక్
మీ సేవా కేంద్రాలకు వెళ్లాల్సిన పనే లేదు..ఏది కావాలన్నా మీ ఊర్లోనే
మీ సేవా కేంద్రాలకు వెళ్లాల్సిన పనే లేదు..ఏది కావాలన్నా మీ ఊర్లోనే
8 + 8 = 4 ఎలా సాధ్యం? గణితం కాదు, లాజిక్ కావాలి..
8 + 8 = 4 ఎలా సాధ్యం? గణితం కాదు, లాజిక్ కావాలి..
గౌతమ్ గంభీర్‌ను కాదని డైరెక్ట్‌గా బీసీసీఐతో సీనియర్ల చర్చలు
గౌతమ్ గంభీర్‌ను కాదని డైరెక్ట్‌గా బీసీసీఐతో సీనియర్ల చర్చలు