AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సెన్సెక్స్ సీన్ రివర్స్!

ఎగ్జిట్‌ పోల్స్ ఫలితాల నేపథ్యంలో నిన్న ఉవ్వెత్తున ఎగిసిన స్టాక్ మార్కెట్లు.. నేడు నష్టాలను చవిచూశాయి. ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గుచూపడంతో కొన్ని రంగాల షేర్లు కుదేలయ్యాయి. ఫలితంగా మంగళవారం నాటి ట్రేడింగ్‌లో సెన్సెక్స్‌ 383 పాయింట్లకు పైగా పతనమవగా.. నిఫ్టీ 119 పాయింట్లు నష్టపోయింది. సోమవారం నాటి జోరుతో దేశీయ మార్కెట్లు ఈ ఉదయం ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి. ట్రేడింగ్‌ ఆరంభంలో సెన్సెక్స్‌ 200 పాయింట్లకు పైగా దూసుకెళ్లి సరికొత్త శిఖరాలను తాకింది. నిఫ్టీ కూడా 50 […]

సెన్సెక్స్ సీన్ రివర్స్!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: May 21, 2019 | 5:51 PM

Share

ఎగ్జిట్‌ పోల్స్ ఫలితాల నేపథ్యంలో నిన్న ఉవ్వెత్తున ఎగిసిన స్టాక్ మార్కెట్లు.. నేడు నష్టాలను చవిచూశాయి. ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గుచూపడంతో కొన్ని రంగాల షేర్లు కుదేలయ్యాయి. ఫలితంగా మంగళవారం నాటి ట్రేడింగ్‌లో సెన్సెక్స్‌ 383 పాయింట్లకు పైగా పతనమవగా.. నిఫ్టీ 119 పాయింట్లు నష్టపోయింది.

సోమవారం నాటి జోరుతో దేశీయ మార్కెట్లు ఈ ఉదయం ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి. ట్రేడింగ్‌ ఆరంభంలో సెన్సెక్స్‌ 200 పాయింట్లకు పైగా దూసుకెళ్లి సరికొత్త శిఖరాలను తాకింది. నిఫ్టీ కూడా 50 పాయింట్ల లాభంతో ట్రేడ్‌ అయ్యింది. అయితే ఆ జోరును సూచీలు కొనసాగించలేకపోయాయి. కీలక రంగాల షేర్లలో మదుపర్లు లాభాల స్వీకరణకు మొగ్గుచూపడంతో ఒత్తిడికి గురైన సూచీలు లాభాలను కోల్పోయాయి. మధ్యాహ్నానికి నష్టాల్లోకి జారుకున్న మార్కెట్లు అంతకంతకూ పతనమవుతూ వచ్చాయి. చివరకు నేటి సెషన్‌లో సెన్సెక్స్‌ 383 పాయింట్లు దిగజారి 38,969 వద్ద, నిఫ్టీ 119 పాయింట్ల నష్టంతో 11,709 వద్ద ముగిశాయి.