AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

శాంసన్‌ దూకుడు..19 బంతుల్లోనే ఆఫ్ సెంచరీ

రాజస్థాన్ రాయల్స్ యువ ఆటగాడు సంజూ శాంసన్ ఇరగదీస్తున్నాడు. షార్జా చెన్నై సూపర్‌ కింగ్స్‌తో మ్యాచ్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌ శాంసన్‌ అదరగొడుతున్నాడు. పేసర్లు, స్పిన్నర్ల బౌలింగ్‌లో ఈజీగా సిక్సర్లతో చితక్కొడుతున్నాడు...

శాంసన్‌ దూకుడు..19 బంతుల్లోనే ఆఫ్ సెంచరీ
సంజూ శాంసన్ తనకి వచ్చిన అవకాశాన్ని సరిగ్గా వినియోగించుకోలేదు. ఆస్ట్రేలియాతో జరిగిన టీ20లలో పూర్తిగా విఫలమయ్యాడు. నిలకడలేమి అతడ్ని జట్టుకు దూరం చేస్తోందని చెప్పాలి.
Sanjay Kasula
|

Updated on: Sep 22, 2020 | 8:39 PM

Share

రాజస్థాన్ రాయల్స్ యువ ఆటగాడు సంజూ శాంసన్ ఇరగదీస్తున్నాడు. షార్జా చెన్నై సూపర్‌ కింగ్స్‌తో మ్యాచ్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌ శాంసన్‌ అదరగొడుతున్నాడు. పేసర్లు, స్పిన్నర్ల బౌలింగ్‌లో ఈజీగా సిక్సర్లతో చితక్కొడుతున్నాడు. ధనాధన్‌ బ్యాటింగ్‌తో కేవలం 19 బంతుల్లోనే ఒక ఫోర్‌, 6 సిక్సర్లతో ఆఫ్ సెంచరీ పూర్తిచేసుకున్నాడు.

స్పిన్నర్‌ పియూశ్‌ చావ్లా వేసిన 8వ ఓవర్లో ఏకంగా మూడు సిక్సర్లు బాది 21 పరుగులు రాబట్టాడు. మరో ఓపెనర్‌ స్టీవ్‌ స్మిత్‌..శాంసన్‌కు పార్టనర్‌గా నిలుస్తున్నాడు. ఆత్మవిశ్వాసంతో ఉన్న శాంసన్‌ రాజస్థాన్‌కు భారీ స్కోరు అందించే దిశగా దూసుకెళ్తున్నాడు. తనదైన మార్క్‌షాట్లతో హిట్టింగ్‌ చేస్తూ ప్రత్యర్థి బౌలర్లను బెంబేలెతిస్తున్నాడు. సంజూ ధాటికి రాజస్థాన్‌ 8 ఓవర్లలోనే 89 పరుగుల మార్క్‌ను అందుకుంది.