AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సమత, హాజీపూర్ కేసుల తుది తీర్పులు వాయిదా.!

Samata And Hajipur Rape Cases: తెలుగు రాష్ట్రాల్లో సంచలన సృష్టించిన రెండు కీలకమైన కేసుల్లో రావాల్సిన తుది తీర్పులు వాయిదా పడ్డాయి. ఇందులో ఒకటి ఆసిఫాబాద్ సమత అత్యాచార కేసు కాగా.. మరొకటి హాజీపూర్ వరుస హత్యల కేసు. రెండు కేసుల్లోని నిందితులకు ఉరి శిక్షను విధించాలని ఇప్పటికే గ్రామస్థులు డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. సమత అత్యాచార కేసులో తీర్పును కోర్టు వాయిదా వేసింది. అనారోగ్యం కారణంగా న్యాయమూర్తి సెలవు తీసుకోవడంతో తుది తీర్పును […]

సమత, హాజీపూర్ కేసుల తుది తీర్పులు వాయిదా.!
Ravi Kiran
|

Updated on: Jan 27, 2020 | 1:47 PM

Share

Samata And Hajipur Rape Cases: తెలుగు రాష్ట్రాల్లో సంచలన సృష్టించిన రెండు కీలకమైన కేసుల్లో రావాల్సిన తుది తీర్పులు వాయిదా పడ్డాయి. ఇందులో ఒకటి ఆసిఫాబాద్ సమత అత్యాచార కేసు కాగా.. మరొకటి హాజీపూర్ వరుస హత్యల కేసు. రెండు కేసుల్లోని నిందితులకు ఉరి శిక్షను విధించాలని ఇప్పటికే గ్రామస్థులు డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే.

సమత అత్యాచార కేసులో తీర్పును కోర్టు వాయిదా వేసింది. అనారోగ్యం కారణంగా న్యాయమూర్తి సెలవు తీసుకోవడంతో తుది తీర్పును ఈ నెల 30వ తేదికి వాయిదా వేస్తున్నట్లు ప్రాసిక్యూషన్ ధర్మారెడ్డి స్పష్టం చేశారు. సుదీర్ఘ విచారణ అనంతరం ఈ కేసుపై తీర్పు ఇవాళ వెలువడే అవకాశం ఉందని అందరూ అనుకున్నారు. కానీ అనూహ్యంగా తుది తీర్పు వాయిదా పడింది. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా లింగాపూర్ మండలం ఎల్లాపటార్‌ గ్రామ అటవీ ప్రాంతంలో  సమతపై అదే గ్రామానికి చెందిన షేక్‌ బాబా, షేక్‌ షాబొద్దీన్‌, షేక్‌ మగ్దూమ్‌లు గ్యాంగ్ రేప్‌కు పాల్పడి.. ఆపై హత్య చేశారు. ఇక ఈ కేసు విచారణ వేగవంతం కావడానికి డిసెంబర్ 11న ఆదిలాబాద్‌లో ప్రత్యేక కోర్టును ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంగతి విదితమే.

మరోవైపు హాజీపూర్ వరుస హత్యల కేసు తుది తీర్పును కూడా నల్గొండ ఫాస్ట్ ట్రాక్ కోర్టు వాయిదా వేసింది. ఈ కేసుపై తుది తీర్పు ఫిబ్రవరి 6న వెలువడనుంది.