ఉప్పు తెచ్చిన కరోనా టెర్రర్..అక్కడ టెన్షన్..టెన్షన్..
చిత్తూరు జిల్లాలో ఓ ఉప్పు వ్యాపారికి కరోనా సింటమ్స్ కనిపించడంతో అతని వద్ద ఉప్పు కొన్నవారు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. పలమనేరు సిటీకి చెందిన 18మంది వ్యాపారులు నాలుగు రోజుల కిందట పెద్దపంజాణి మండలం రాయలపేటకు చెందిన ఓ వ్యక్తి వద్ద నుంచి ఉప్పు బస్తాలను కొనుగోలు చేశారు. అతనికి పలమనేరు ట్రూనాట్లో ఇటీవల నిర్వహించిన ప్రైమరీ టెస్టుల్లో కోవిడ్-19 సింటమ్స్ ఉన్నట్లు గుర్తించారు. తదుపరి పరీక్షల నిమిత్తం రెండు రోజుల కిందట తిరుపతికి తరలించారు. విషయం […]
చిత్తూరు జిల్లాలో ఓ ఉప్పు వ్యాపారికి కరోనా సింటమ్స్ కనిపించడంతో అతని వద్ద ఉప్పు కొన్నవారు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. పలమనేరు సిటీకి చెందిన 18మంది వ్యాపారులు నాలుగు రోజుల కిందట పెద్దపంజాణి మండలం రాయలపేటకు చెందిన ఓ వ్యక్తి వద్ద నుంచి ఉప్పు బస్తాలను కొనుగోలు చేశారు. అతనికి పలమనేరు ట్రూనాట్లో ఇటీవల నిర్వహించిన ప్రైమరీ టెస్టుల్లో కోవిడ్-19 సింటమ్స్ ఉన్నట్లు గుర్తించారు.
తదుపరి పరీక్షల నిమిత్తం రెండు రోజుల కిందట తిరుపతికి తరలించారు. విషయం తెలుసుకున్న స్థానికుల్లో తీవ్ర ఆందోళన మొదలైంది. కొందరైతే ఎందుకైనా మంచిదని తాము కూడా కరోనా టెస్టులు చేయించుకునేందుకు రెడీ అయ్యారు.