AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రైవేట్ బస్సులపై ఆర్డీఏ కొరడా..!

సంక్రాంతి పండుగ నేపథ్యంలో ప్రవేట్ ట్రావెల్స్ టిక్కెట్ల ధరలను అమాంతం పెంచేసి సామాన్యులపై అధిక భారాన్ని మోపుతున్నాయి. దీంతో రంగంలోకి దిగిన ఆర్డీఏ అధికారులు ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. కీసర టోల్ ప్లాజా, గరికపాడు చెక్ పోస్టు ,కనకదుర్గమ్మ వారధి, పొట్టిపాడు టోల్ ప్లాజా, పటమట ఎన్టీఆర్ సర్కిల్స్ వద్ద దాడులు నిర్వహించారు. ఈ నెల 7వ తేదీ దగ్గర నుంచి 18 వరకు ఈ తనిఖీలు జరగ్గా.. ఇందులో అధిక చార్జీలు వసూలు చేస్తూ, నిబంధనలు […]

ప్రైవేట్ బస్సులపై ఆర్డీఏ కొరడా..!
Ravi Kiran
|

Updated on: Jan 18, 2020 | 2:18 PM

Share

సంక్రాంతి పండుగ నేపథ్యంలో ప్రవేట్ ట్రావెల్స్ టిక్కెట్ల ధరలను అమాంతం పెంచేసి సామాన్యులపై అధిక భారాన్ని మోపుతున్నాయి. దీంతో రంగంలోకి దిగిన ఆర్డీఏ అధికారులు ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. కీసర టోల్ ప్లాజా, గరికపాడు చెక్ పోస్టు ,కనకదుర్గమ్మ వారధి, పొట్టిపాడు టోల్ ప్లాజా, పటమట ఎన్టీఆర్ సర్కిల్స్ వద్ద దాడులు నిర్వహించారు.

ఈ నెల 7వ తేదీ దగ్గర నుంచి 18 వరకు ఈ తనిఖీలు జరగ్గా.. ఇందులో అధిక చార్జీలు వసూలు చేస్తూ, నిబంధనలు విరుద్ధంగా నడుపుతోన్న 225 బస్సులను ఆర్డీఏ అధికారులు సీజ్ చేశారు. అంతేకాకుండా మార్నింగ్ స్టార్, వాలిశెట్టి ట్రావెల్స్, సాయి శ్రీనివాస ట్రావెల్స్ బస్సులపై కేసులు నమోదు చేశారు.