“రోహిత్ను టీ20 జట్టు కెప్టెన్ చెయ్యాలి”
భారత క్రికెట్ టీమ్ కు స్ల్పిట్ కెప్టెన్సీ విధానం అనగా వివిధ ఫార్మాట్లకు వేర్వేరు కెప్టెన్లు ఉండాలని భారత మాజీ పేసర్ అతుల్ వాసన్ అభిప్రాయపడ్డాడు. ప్రస్తుతం మూడు ఫార్మాట్లలోనూ విరాట్ జట్టుకు నాయకత్వం వహిస్తోన్న సంగతి తెలిసిందే. టెస్టులు, వన్డేల్లో కోహ్లీ కెప్టెన్ గా కొనసాగిస్తూ, పొట్టి క్రికెట్ లో మాత్రం రోహిత్ శర్మకు నాయకత్వ పగ్గాలు అప్పగిస్తే బాగుంటుందని సూచించాడు. ఈ క్రమంలో కోహ్లీపై ఒత్తిడి, పనిభారం తగ్గుతుందని వివరించాడు. నిజానికి గత రెండేళ్లలో […]
భారత క్రికెట్ టీమ్ కు స్ల్పిట్ కెప్టెన్సీ విధానం అనగా వివిధ ఫార్మాట్లకు వేర్వేరు కెప్టెన్లు ఉండాలని భారత మాజీ పేసర్ అతుల్ వాసన్ అభిప్రాయపడ్డాడు. ప్రస్తుతం మూడు ఫార్మాట్లలోనూ విరాట్ జట్టుకు నాయకత్వం వహిస్తోన్న సంగతి తెలిసిందే. టెస్టులు, వన్డేల్లో కోహ్లీ కెప్టెన్ గా కొనసాగిస్తూ, పొట్టి క్రికెట్ లో మాత్రం రోహిత్ శర్మకు నాయకత్వ పగ్గాలు అప్పగిస్తే బాగుంటుందని సూచించాడు. ఈ క్రమంలో కోహ్లీపై ఒత్తిడి, పనిభారం తగ్గుతుందని వివరించాడు. నిజానికి గత రెండేళ్లలో వివిధ కారణాలు వల్ల టీ20 క్రికెట్ పార్మాట్లో కోహ్లీ కన్నా ఎక్కువగా రోహితే జట్టుకు నాయకత్వం వహించాడు.
టీ20ల్లో రోహిత్కు అదిరిపోయే ట్రాక్ రికార్డు ఉంది. 19 మ్యాచ్ల్లో జట్టుకు కెప్టెన్ గా వ్యవహరించిన రోహిత్.. 15 మ్యాచ్ల్లో జట్టును విజయతీరాలకు చేర్చాడు. ఇక కోహ్లీ 37 టీ20 మ్యాచ్ల్లో జట్టును కెప్టెన్ గా ముందుకు నడిపించగా.. 22 మ్యాచ్ల్లో గెలిపించాడు. గత కొంతకాలంగా కోహ్లీ.. టీ20లు ఆడకుండా ఎక్కువగా రెస్ట్ తీసుకున్నాడు. వాస్తవానికి 2017లోనే ధోనీ కెప్టెన్సీ నుంచి తప్పుకోగా.. అప్పట్లో ఎమ్మెస్కే ప్రసాద్ నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీ రోహిత్కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించేందుకు వెనకడుగు వేసింది. రానున్న రెండేళ్లలో వరుసగా రెండు టీ20 వరల్డ్ కప్స్ జరుగనున్ననేపథ్యంలో రోహిత్కు సారథ్య బాధ్యతలపై సునీల్ జోషీ నేతృత్వంలోని ప్రస్తుత సెలెక్షన్ కమిటీ ఒక డెషిసన్ తీసుకుంటుందో లేదో చూడాలి.