తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఇలా ఉంది..
తెలంగాణలో కొత్తగా 2,392 కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ వెల్లడించింది. కొత్త కేసులతో కలిపి రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 1,45,163కు చేరింది. తాజాగా వైరస్తో 11 మంది మృతి చెందగా...
Corona Cases in Telangana : రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతున్నాయి. వేల సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24గంటల్లో తెలంగాణలో కొత్తగా 2,392 కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ వెల్లడించింది. కొత్త కేసులతో కలిపి రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 1,45,163కు చేరింది. తాజాగా వైరస్తో 11 మంది మృతి చెందగా, మృతుల సంఖ్య 906కు చేరింది.
తెలంగాణ వ్యాప్తంగా కరోనా వచ్చినవారి సంఖ్య వైరస్ నుంచి కొలుకున్నవారి నెంబర్ కూడా అదే స్థాయిలో ఉంది. వైరస్ నుంచి 2,346 మంది వైరస్ నుంచి కొలుకోగా, మొత్తం 1,12,587 మంది బాధితులు డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 31,670 యాక్టివ్ కేసులు ఉన్నట్లు వైద్య, ఆరోగ్యశాఖ పేర్కొంది. మరో 24,579 మంది హోం ఐసోలేషన్లో ఉన్నట్లు తెలిపింది.
తాజాగా నమోదైన కేసుల్లో గ్రేటర్ హైదరాబాద్ జీహెచ్ఎంసీ పరిదిలో 304 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. తర్వాత రంగారెడ్డి జిల్లాలో 191, కరీంనగర్లో 157, మేడ్చల్ మల్కాజ్గిరిలో 132, ఖమ్మంలో 116, నల్గొండలో 105, నిజామాబాద్లో 102, సూర్యపేటలో 101, భద్రాద్రి కొత్తగూడెంలో 95, వరంగల్ అర్బన్లో 91 పాజిటివ్ కేసులు రికార్డయ్యాయి. గతంలో కేవలం గ్రేటర్ పరిధిలో మాత్రమే కేసులు అధికంగా వస్తుండేవి .. అయితే ఇప్పుడు జీహెచ్ఎంసీ పరిధిలో కరోనా బాధితుల సంఖ్య కొద్దిగా తగ్గింది. ఇప్పుడు జిల్లాల్లో పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది.