మాజీ బ్యూటీ అమీషాపటేల్కు అరెస్ట్ వారెంట్..!
మాజీ బ్యూటీ అమీషాపటేల్కు రాంచీ కోర్టు భారీ షాక్ ఇచ్చింది. ఓ సినిమా నిర్మాణం కోసమని అజయ్ కుమార్ సింగ్ అనే ఫైనాన్షియర్ నుంచి మూడు కోట్లు తీసుకుందట. కాని సినిమా మధ్యలోనే ఆగిపోవడంతో అమీషా పటేల్ చిక్కుల్లో పడింది. ఫైనాన్షియర్ అజయ్ కుమార్ సింగ్కి డబ్బులు తిరిగి ఇవ్వలేకపోయింది. చెక్ ఇచ్చినా అది బౌన్స్ కావడంతో అజయ్ కుమార్ సింగ్ కేసు పెట్టారు. దీంతో అప్పు ఎగవేసినందుకు రాంచీ కోర్టు ఆమెకు సమన్లు జారీ చేసింది. […]
మాజీ బ్యూటీ అమీషాపటేల్కు రాంచీ కోర్టు భారీ షాక్ ఇచ్చింది. ఓ సినిమా నిర్మాణం కోసమని అజయ్ కుమార్ సింగ్ అనే ఫైనాన్షియర్ నుంచి మూడు కోట్లు తీసుకుందట. కాని సినిమా మధ్యలోనే ఆగిపోవడంతో అమీషా పటేల్ చిక్కుల్లో పడింది. ఫైనాన్షియర్ అజయ్ కుమార్ సింగ్కి డబ్బులు తిరిగి ఇవ్వలేకపోయింది. చెక్ ఇచ్చినా అది బౌన్స్ కావడంతో అజయ్ కుమార్ సింగ్ కేసు పెట్టారు. దీంతో అప్పు ఎగవేసినందుకు రాంచీ కోర్టు ఆమెకు సమన్లు జారీ చేసింది. కాగా, ఈ నెల 8వ తేదీన అమీషా కోర్టుకు హాజరు కావాలి.. లేదంటే అరెస్టు వారెంట్ జారీ చేస్తారట. సినిమాలు లేకపోవడంతో.. సోషల్ మీడియాలో రోజూ ఫోటోలు అప్ డేట్ చేసుకుంటూ సంపాదించుకుంటోంది. మరోవైపు అయ్యో పాపం అమీషా పటేల్ మళ్లీ కోట్ల అప్పుల్లో చిక్కుకుందంటూ నెటిజెన్లు ఆమెపై జాలి వర్షం కురిపిస్తున్నారు.