విజయాలు నిల్…పారితోషికం ఫుల్…రకుల్‌

| Edited By:

Mar 08, 2019 | 1:21 PM

స్టార్‌ ఇమేజ్‌ ఉన్న నటీనటుల పారితోషికాలను చూస్తుంటే మతిపోతోంది. హీరోలు రూ.30 కోట్ల వరకు డిమాండ్‌ చేస్తుంటే హీరోయిన్లు కూడా రూ.8 కోట్లకు పైనే పుచ్చుకుంటున్నారు. బాలీవుడ్‌ హీరోయిన్లు రూ.12 కోట్ల వరకూ డిమాండ్‌ చేస్తున్నారు. ఇక దక్షిణాదిలో భారీ పారితోషికం పుచ్చుకుంటున్న నటి నయనతార. ఈ సంచలన నటి రూ.5 కోట్లు తీసుకుంటున్నట్లు సినీ వర్గాల సమాచారం. మొన్నటి వరకూ కోలీవుడ్‌లో హిట్‌ కోసం పడిగాపులు పడ్డ నటి రకుల్‌ ప్రీత్‌సింగ్‌ ఆ మధ్య కార్తీతో […]

విజయాలు నిల్...పారితోషికం ఫుల్...రకుల్‌
Follow us on

స్టార్‌ ఇమేజ్‌ ఉన్న నటీనటుల పారితోషికాలను చూస్తుంటే మతిపోతోంది. హీరోలు రూ.30 కోట్ల వరకు డిమాండ్‌ చేస్తుంటే హీరోయిన్లు కూడా రూ.8 కోట్లకు పైనే పుచ్చుకుంటున్నారు. బాలీవుడ్‌ హీరోయిన్లు రూ.12 కోట్ల వరకూ డిమాండ్‌ చేస్తున్నారు. ఇక దక్షిణాదిలో భారీ పారితోషికం పుచ్చుకుంటున్న నటి నయనతార. ఈ సంచలన నటి రూ.5 కోట్లు తీసుకుంటున్నట్లు సినీ వర్గాల సమాచారం.

మొన్నటి వరకూ కోలీవుడ్‌లో హిట్‌ కోసం పడిగాపులు పడ్డ నటి రకుల్‌ ప్రీత్‌సింగ్‌ ఆ మధ్య కార్తీతో జత కట్టిన ‘ధీరన్‌ అధికారం ఒండ్రు’ చిత్ర విజయంతో కోటి వరకూ పారితోషికాన్ని డిమాండ్‌ చేసింది. ఇటీవల మరోసారి కార్తీతో రొమాన్స్‌ చేసిన ‘దేవ్‌’ చిత్రం నిరాశపరిచింది. అయినా కూడా మరోసారి పారీతోషికాన్ని పెంచేసిందట రకుల్‌. ప్రస్తుతం కోలీవుడ్‌లో సూర్యకు జంటగా నటించిన ‘ఎన్‌జీకే’ చిత్రం సమ్మర్‌ స్పెషల్‌గా విడుదలకు ముస్తాబవుతోంది. అదే విధంగా శివకార్తికేయన్‌తో ఒక చిత్రంలో నటిస్తోంది. ప్రస్తుతం తెలుగులో రకుల్‌కి పెద్దగా అవకాశాలు లేవు. అయినా తెలుగులో నాగార్జునకు జంటగా నటించే చిత్రం కోసం రకుల్‌ ప్రీత్‌సింగ్‌ ప్రస్తుతం తీసుకుంటున్న పారితోషికానికి మరో సగం పెంచేసి రూ.1.50 కోట్లు డిమాండ్‌ చేసినట్లు సోషల్‌ మీడియాలో ప్రచారం అవుతోంది. మరో విజయం సాధించేవరకూ ఇదే పారితోషికాన్ని మెయిన్‌టేన్‌ చేయాలని భావిస్తున్నట్లు సమాచారం.

ఈ రోజుల్లో తాజా ధోరణిగా వయసుపైబడ్డ కధానాయకుల‌ సరసన నటిస్తున్న హీరోయిన్‍లు తమ పారితోషికాన్ని రెండింతలు చేస్తున్నారు. పాయల్ రాజపుత్ వెంకీ మామలో వెంకటేష్ కోసం చేస్తున్నది అదే… మరియు తమన్న ఇప్పటికే F2 లో చేసారు.