AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రాజస్థాన్‌లో 53 వేలు దాటిన కరోనా కేసులు

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకున్నా చాపకింద నీరులా కరోనా వైరస్ వ్యాప్తి చెందుతూనే ఉంది. రాజస్థాన్‌లో కరోనా మహమ్మారి ధాటికి నిత్యం వందల సంఖ్యలో పాజిటివ్‌ కేసులు నమోదవుతుండగా, మరణాల సంఖ్య కూడా అంతకంతకు పెరుగుతుండడంతో ఆందోళన కలిగిస్తోంది.

రాజస్థాన్‌లో 53 వేలు దాటిన కరోనా కేసులు
Balaraju Goud
|

Updated on: Aug 10, 2020 | 3:12 PM

Share

కొత్తగా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతు వస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకున్నా చాపకింద నీరులా కరోనా వైరస్ వ్యాప్తి చెందుతూనే ఉంది. రాజస్థాన్‌లో కరోనా మహమ్మారి ధాటికి నిత్యం వందల సంఖ్యలో పాజిటివ్‌ కేసులు నమోదవుతుండగా, మరణాల సంఖ్య కూడా అంతకంతకు పెరుగుతుండడంతో ఆందోళన కలిగిస్తోంది. గడిచిన 24 గంటల్లో ఆ రాష్ట్రంలో కొత్తగా 598 కరోనా కేసులు నమోదు కాగా, 136 మంది చికిత్సకు కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఇక ఒక్కరోజులో ఆరుగురు కరోనా బారిన పడి మృత్యువాత పడ్డారు. ఇప్పటివరకు ఆ రాష్ట్ర వ్యాప్తంగా 53,095 కరోనా కేసులు నమోదు కాగా 35,698 మంది చికిత్సకు కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఇక, ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 13,946 మంది వివిధ ఆస్పత్రులతో పాటు క్వారంటైన్ లో చికిత్స పొందుతున్నారు. ఇదిలావుంటే ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా కరోనా వైరస్ ఇన్‌ఫెక్షన్ల కారణంగా 795 మంది మృతి చెందారని ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ నివేదికలో వెల్లడించింది. ఇక, రోజు రోజుకీ కొత్త కేసులు వెలుగుచూస్తుండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండి కరోనా నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని సూచిస్తున్నారు.