AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పదిమంది కలిసి కొట్టారు.. పోలీసులకు కంప్లైంట్ ఇచ్చిన రాహుల్!

తనపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించారు రాహుల్ సిప్లిగంజ్. తన స్నేహితులతో కలిసి పబ్బుకు వెళ్లిన క్రమంలో ఇరువర్గాల మధ్య వివాదం తలెత్తినట్లుగా చెప్పారు. తన వెంట వచ్చిన స్నేహితులను..

పదిమంది కలిసి కొట్టారు.. పోలీసులకు కంప్లైంట్ ఇచ్చిన రాహుల్!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Mar 05, 2020 | 4:19 PM

Share

బిగ్‌బాస్‌-3 విజేత, సింగర్ రాహుల్‌ సిప్లిగంజ్‌పై జరిగిన దాడి కేసును పోలీసులు సుమోటోగా తీసుకుని విచారిస్తున్నారు. హైదరాబాద్‌లోని ఓ పబ్బులో అర్ధరాత్రి జరిగిన గొడవలో రాహుల్‌ సిప్లిగంజ్‌పై కొందరు యువకులు దాడి చేశారు. తలపై బీరు సీసాలతో కొట్టడంతో రాహుల్ గాయపడ్డాడు. జరిగిన ఘటనపై రాహుల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. చికిత్స అనంతరం తిరిగి మీడియా ముందుకు వచ్చారు రాహుల్.

‘తనపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించారు రాహుల్ సిప్లిగంజ్. తన స్నేహితులతో కలిసి పబ్బుకు వెళ్లిన క్రమంలో ఇరువర్గాల మధ్య వివాదం తలెత్తినట్లుగా చెప్పారు. తన వెంట వచ్చిన స్నేహితులను రితేష్ వర్గం వేధించారని ఆరోపించారు. తమతో అసభ్యంగా ప్రవర్తిస్తూ.. రెచ్చగొట్టేలా వ్యాఖ్యానించారని చెప్పారు. ఈ క్రమంలోనే ఇరువర్గాల మధ్య వివాదం తలెత్తినట్లుగా తెలిపారు. అయితే ఒకేసారి పదిమంది కలిసిన తనపై దాడికి దిగినట్లుగా రాహుల్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు వివరించారు. తనకు న్యాయం జరుగుతుందనే నమ్ముతున్నానని’ చెప్పారు. ఇదిలా ఉంటే, మరో వైపు దాడి చేశాడని.. రాహుల్ స్నేహితురాలిని వేధించారన్నది ఒక వెర్షన్.

కాగా బిగ్ బాస్ తర్వాత రాహుల్ ప్రస్తుతం కృష్ణవంశీ డైరెక్షన్‌లో రంగమార్తాండ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నాడు. అటు పలు ప్రమోషనల్ సాంగ్స్‌తో పాటు ప్రైవేట్ షోలను సైతం నిర్విస్తున్నాడు. ఇక ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి తమ్ముడు రితేష్ రెడ్డి, ప్రస్తుతం వ్యాపారాలు చూసుకుంటాడు.