పారికర్ బెడ్‌రూం నుంచే అమిత్ షా తీసుకెళ్లారు: కాంగ్రెస్

TV9 Telugu Digital Desk

TV9 Telugu Digital Desk | Edited By: Ravi Kiran

Updated on: Sep 01, 2020 | 7:48 PM

న్యూఢిల్లీ: రాఫెల్ రగడ ఇంకా రగులుతూనే ఉంది. తాజాగా గోవాలో వేడి రాఫెల్ రాజుకుంది. బీజేపీపై కాంగ్రెస్ పార్టీ తన దాడిని కొనసాగిస్తోంది. తాజాగా ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షాపై సంచలన ఆరోపణలు చేసింది. గత శనివారం గోవా పర్యటనకు వచ్చిన అమిత్ షా, సీఎం మనోహర్ పారికర్ బెడ్ రూం నుంచి రాఫెల్‌ ఒప్పంద పత్రాలను పట్టుకెళ్లారని ఆ రాష్ట్ర కాంగ్రెస్ అధికార ప్రతినిధి జితేంద్ర దేశ్ ప్రభు అన్నారు. రాఫెల్ పత్రాలు […]

పారికర్ బెడ్‌రూం నుంచే అమిత్ షా తీసుకెళ్లారు: కాంగ్రెస్

న్యూఢిల్లీ: రాఫెల్ రగడ ఇంకా రగులుతూనే ఉంది. తాజాగా గోవాలో వేడి రాఫెల్ రాజుకుంది. బీజేపీపై కాంగ్రెస్ పార్టీ తన దాడిని కొనసాగిస్తోంది. తాజాగా ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షాపై సంచలన ఆరోపణలు చేసింది. గత శనివారం గోవా పర్యటనకు వచ్చిన అమిత్ షా, సీఎం మనోహర్ పారికర్ బెడ్ రూం నుంచి రాఫెల్‌ ఒప్పంద పత్రాలను పట్టుకెళ్లారని ఆ రాష్ట్ర కాంగ్రెస్ అధికార ప్రతినిధి జితేంద్ర దేశ్ ప్రభు అన్నారు.

రాఫెల్ పత్రాలు పారికర్ బెడ్‌రూంలో ఉన్నాయని స్వయంగా గోవా ఆరోగ్య శాఖ మంత్రి విశ్వజిత్ రానె చెబుతున్నట్టు ఉన్న ఓ ఆడియో టేప్ ఇటీవలే సంచలనం సృష్టించింది. ఈ ఆడియో టేప్ దృష్ట్యానే కాంగ్రెస్ అమిత్ షాను టార్గెట్ చేసింది. అయితే తన నివాసంలో రాఫెల్ ఫైళ్లు ఉన్నాయన్న ఆరోపణలను పారికర్ కొట్టిపారేశారు.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu