AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పూజారులను బురిడీ కొట్టించిన కిలాడీ దంపతులు

పూజారులకే శఠగోపం పెట్టారో దంపతులు.. పూజలు, యాగాలు, గట్రాలు ఇలా అన్నీ చేయించుకున్నాక సంభావన కింద దొంగనోట్లు ఇచ్చి పంపించారు.. ఉత్తరప్రదేశ్‌లోని సీతాపూర్‌లో జరిగింది ఈ సంఘటన.. గీతా పతాక్‌, గులాసిరామ్‌ పతాక్‌ అనే దంపతులకు ఇదే పని! పూజలు, యాగాలు అంటూ ఊళ్లో వాళ్లదగ్గర డబ్బులు వసూలు చేయడం, పూజారులకేమో దొంగనోట్లు ఇవ్వడం వారికి అలవాటుగా మారింది..మొన్న ఇలాగే ఓ మారథాన్‌ పూజ చేయాలంటూ ఓ 60 మంది పూజారులను పిలిచారు.. పాపం 14 రోజుల […]

పూజారులను బురిడీ కొట్టించిన కిలాడీ దంపతులు
Pardhasaradhi Peri
|

Updated on: Aug 29, 2020 | 4:26 PM

Share

పూజారులకే శఠగోపం పెట్టారో దంపతులు.. పూజలు, యాగాలు, గట్రాలు ఇలా అన్నీ చేయించుకున్నాక సంభావన కింద దొంగనోట్లు ఇచ్చి పంపించారు.. ఉత్తరప్రదేశ్‌లోని సీతాపూర్‌లో జరిగింది ఈ సంఘటన.. గీతా పతాక్‌, గులాసిరామ్‌ పతాక్‌ అనే దంపతులకు ఇదే పని! పూజలు, యాగాలు అంటూ ఊళ్లో వాళ్లదగ్గర డబ్బులు వసూలు చేయడం, పూజారులకేమో దొంగనోట్లు ఇవ్వడం వారికి అలవాటుగా మారింది..మొన్న ఇలాగే ఓ మారథాన్‌ పూజ చేయాలంటూ ఓ 60 మంది పూజారులను పిలిచారు.. పాపం 14 రోజుల పాటు వారంతా ఆ దంపతుల ఆశ్రమంలోనే ఉంటూ పూజలు చేశారు.. పూజలన్నీ అయ్యాక పూజారులకు ఓ బ్యాగ్‌ ఇచ్చారు.. అందులో డబ్బు ఉందని, తర్వాత బ్యాగ్‌ తెరవమని చెప్పారు.. వారి మాటలను నమ్మేసిన పూజారులు కాసేపయ్యాక బ్యాగ్‌ తెరిచి చూసి బిత్తరపోయారు.. బ్యాగ్‌లో నిండా దూది కూరి ఉంది.. కొన్ని దొంగ నోట్లు కూడా ఉన్నాయి.. దాంతో దిలీప్‌కుమార్‌ అనే పూజారి పోలీసులకు ఫిర్యాదు చేశారు.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు గీత, గులాసి రామ్‌లను అదుపులోకి తీసుకున్నారు. గతంలో ఇలాగే చాలా మంది పంతుళ్లను మోసం చేసినట్టు విచారణలో తేలింది..