AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆర్టీసీ టికెట్ల కోసం మొబైల్ యాప్.. పిన్ నెంబర్ చెబితే చాలు..

'ప్రథమ్' పేరుతో కొత్త యాప్ ను ఏపీఎస్‌ఆర్టీసీ అందుబాటులోకి తీసుకురానుంది. బస్సు టికెట్ల కోసం కొత్త యాప్‌ను వినియోగించనుంది. తొలుత విశాఖ, విజయవాడ సిటీ బస్సుల్లో పరిధిలో ఈ యాప్‌ ద్వారా టికెట్ల

ఆర్టీసీ టికెట్ల కోసం మొబైల్ యాప్.. పిన్ నెంబర్ చెబితే చాలు..
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jun 30, 2020 | 8:25 AM

Share

‘ప్రథమ్’ పేరుతో కొత్త యాప్ ను ఏపీఎస్‌ఆర్టీసీ అందుబాటులోకి తీసుకురానుంది. బస్సు టికెట్ల కోసం కొత్త యాప్‌ను వినియోగించనుంది. తొలుత విశాఖ, విజయవాడ సిటీ బస్సుల్లో పరిధిలో ఈ యాప్‌ ద్వారా టికెట్ల జారీని చేపట్టాలని భావించినా.. ఇప్పుడు పల్లె వెలుగుసహా అన్ని బస్సులకూ ఈ యాప్‌నే వాడాలని నిర్ణయించింది. వచ్చే నెలలో ఇది అందుబాటులోకి రానుంది. దీనికి ‘ప్రథమ్‌’ అనే పేరు పరిశీలనలో ఉంది.

ఏపీఎస్‌ఆర్టీసీ సేవలు డిజిటలైజేషన్ దిశగా పరుగులు పెడుతున్నాయి. ప్రయాణికుడు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్లాలనేది యాప్‌లో నమోదు చేస్తే ఏయే బస్సులు ఏ సమయంలో అందుబాటులో ఉన్నాయనేది చూపిస్తుంది. అప్పుడు బస్సును ఎంపిక చేసుకుని టికెట్‌ కొనుగోలు చేయవచ్చు. ఆన్‌లైన్‌లో చెల్లింపులు జరపాలి. టికెట్‌ జారీ అయినట్లు మెసేజ్‌తోపాటు 4 అంకెల పిన్‌ నంబరు వస్తుంది. ప్రయాణికుడు బస్‌ ఎక్కే సమయంలో డ్రైవర్‌కు పిన్‌ నంబరు చెబితే సరిపోతుంది.

Also Read: ప్రైవేట్‌ మెడికల్‌, డెంటల్‌ కాలేజీల్లో.. పీజీ మెడికల్‌ అడ్మిషన్లకు లైన్ క్లియర్..!