
కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై రామ్ చరణ్ నిర్మాణంలో.. మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ సినిమా సైరా నరసింహారెడ్డి. ఈ సినిమాకి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. రాయలసీమకు చెందిన మొదటితరం స్వతంత్రయోధుడైన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా ఈ మూవీ తెరకెక్కుతోంది. కాగా ఈ చిత్ర టీజర్ని నేడు విడుదల చేశారు. ఐతే ఈ చిత్ర టీజర్ విడుదల కోసం ముంబై వెళ్లిన చిరంజీవి, రామ్ చరణ్ లను ప్రభాస్ కలిశాడు. వీరు ముగ్గురూ కలిసి దిగిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఆ ఫోటో చుస్తే అల్లూరి సీతారామరాజు, సైరా నరసింహా రెడ్డి, సాహో ని ఒకే ఫ్రేమ్లో చేసినట్లు అనిపిస్తోంది.