AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తెరుచుకున్న కేదార్‌నాథ్ ద్వారాలు

పరమ పవిత్ర పుణ్యక్షేత్రం కేదార్‌నాథ్‌ ఆలయం ఇవాళ తలుపులు తెరుచుకుంది. దీంతో కేదార్‌నాథుని దర్శించుకునేందుకు భక్తులు తెల్లవారు జామునుంచే క్యూ కట్టారు. ఆరు నెలల పాటు భక్తులు స్వామివారిని దర్శించుకునే అవకాశం ఉంది. అక్టోబర్-నవంబర్ మధ్యకాలంలో మళ్లీ ఈ ఆలయాన్ని మూసివేస్తారు. భక్తులకు ఏలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. శీతాకాలంలో ఈ ఆలయ ప్రాంతంలో విపరీతమైన మంచు కురుస్తుంది. ఈ కారణంగా ఆలయాన్ని మూసివేస్తారు. అనంతరం వేసవి ఆరంభమైన కొద్దిరోజులకు ఆలయ ద్వారాలను […]

తెరుచుకున్న కేదార్‌నాథ్ ద్వారాలు
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: May 09, 2019 | 11:57 AM

Share

పరమ పవిత్ర పుణ్యక్షేత్రం కేదార్‌నాథ్‌ ఆలయం ఇవాళ తలుపులు తెరుచుకుంది. దీంతో కేదార్‌నాథుని దర్శించుకునేందుకు భక్తులు తెల్లవారు జామునుంచే క్యూ కట్టారు. ఆరు నెలల పాటు భక్తులు స్వామివారిని దర్శించుకునే అవకాశం ఉంది. అక్టోబర్-నవంబర్ మధ్యకాలంలో మళ్లీ ఈ ఆలయాన్ని మూసివేస్తారు. భక్తులకు ఏలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. శీతాకాలంలో ఈ ఆలయ ప్రాంతంలో విపరీతమైన మంచు కురుస్తుంది. ఈ కారణంగా ఆలయాన్ని మూసివేస్తారు. అనంతరం వేసవి ఆరంభమైన కొద్దిరోజులకు ఆలయ ద్వారాలను తెరిచి.. భక్తులకు ప్రవేశాన్ని కల్పిస్తారు. మరోవైపు బద్రీనాథ్‌ ఆలయం శుక్రవారం నుంచి తెరుచుకోనుంది. దీనికి సంబంధించి ఆలయ కమిటీ ప్రతినిధులు ఏర్పాట్లు చేస్తున్నారు.