Crime News : వివాహిత మహిళలే అతడి టార్గెట్..ఆ తరహా క్రైమ్స్లో కీచకుడు ఎక్స్పర్ట్..పోలీసులే షాక్
వివాహిత మహిళలతో సన్నిహితంగా ఉంటూ వారి ఫొటోలు తీసి మార్పింగ్ చేసి డబ్బులు ఇవ్వాలని బెదిరింపులకు పాల్పడుతున్న మధు అనే ఘరానా మోసగాడిని పీలేరు రూరల్ పోలీసులు అరెస్టు చేశారు.
వివాహిత మహిళలతో సన్నిహితంగా ఉంటూ వారి ఫొటోలు తీసి మార్పింగ్ చేసి డబ్బులు ఇవ్వాలని బెదిరింపులకు పాల్పడుతున్న మధు అనే ఘరానా మోసగాడిని పీలేరు రూరల్ పోలీసులు అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళ్తే…తవణంపల్లి మండలం పైపల్లి గ్రామానికి చెందిన మధు అలియాస్ వసంత్ కుమార్ రెడ్డి కారు డ్రైవర్గా పనిచేస్తున్నాడు. అయితే అది టైమ్ పాస్ పని మాత్రమే. అతడి మెయిన్ స్ట్రీమ్ వర్క్ వివాహితలను ట్రాప్ చెయ్యడం. అవును తొలుత వివాహిత మహిళలతో పరిచయం పెంచుకుని సన్నిహితంగా మెలుగుతాడు. ఆ తర్వాత కుదిరితే వారి ఫోటోలను రహస్యంగా చిత్రీకరిస్తాడు. లేదంటే నార్మల్గా తీసిన ఫోటోలను నగ్న చిత్రాలుగా మార్పింగ్ చేస్తాడు. ఆపైన డబ్బులు ఇవ్వాలి..లేదంటే ఆ ఫోటోలను ఇంటర్నెట్లో సర్కులేట్ చేస్తానని బెదిరిస్తాడు. అతడి వేధింపులు తట్టుకోలేక రొంపిచర్లకు చెందిన ఒక మహిళ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మధు వ్యవహారం వెలుగులోకి వచ్చింది.
విచారణలో నిందితుడి నేర చరిత్ర గుట్టు బయటపడింది. మధుపై జిల్లాలోని పలమనేరు, తవణంపల్లి, ఐరాల, రొంపిచర్ల పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. అంతేకాదు రైల్వేలో ఉద్యోగాలు ఇప్పిస్తానని డబ్బులు తీసుకొని మోసాలకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. మధును అరెస్టు చేసి అతని వద్ద నుంచి 2 మొబైల్ ఫోన్స్, ల్యాప్ టాప్ స్వాధీనం చేసుకున్నారు.
Also Read :
Coronavirus Alert : సూర్యాపేటలో కరోనా కన్నెర్ర..ఒక కుటుంబంలో ఏకంగా 22 మందికి వైరస్ పాజిటివ్